DH Srinivasa Rao : ఫోర్త్ వేవ్ పై కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతున్న కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చైనాలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారత్లో కూడా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ.. చైనా, తైవాన్, ఈజిప్టు లో కేసులు పెరుగుతున్నాయని, ఢిల్లీ, హర్యానా, యూపీ లో కేసుల సంఖ్య పెరిగిందన్నారు. రాష్ట్రంలో నాలుగు నుంచి ఆరు వారాల్లో ఎలాంటి మార్పు లేదని, 20 నుంచి 25 కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో మాత్రమే 10 నుంచి 15 కేసులు నమోదు అవుతున్నాయని, ఫోర్త్ వేవ్ పై అనేక సందేహాలు ఉండడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయన్నారు.
థార్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, వేసవికాలంలో వేలాది శుభకార్యాలు ఉంటాయి. జాగ్రత్తలు అవసరమన్నారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన వెల్లడించారు. ప్రజలందరూ మాస్క్, సానిటైజేషన్ ఉపయోగించాలని, వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలని ఆయన సూచించారు. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ 100 శాతం తీసుకున్నారని, 60 సంవత్సరాల పైబడిన వారు బుస్టార్ డోస్ తీసుకోవాలన్నారు. తెలంగాణలో ఆర్ వ్యాల్యూ .5శాతమే ఉందని, కానీ మాస్క్ ధరించాలన్నారు. ఫోర్త్ వేవ్ తెలంగాణలోరాదు. సిరో సర్వే ప్రకారం జనవరి 4వ తేదీన నిర్వహించారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
14,179 మంది యాంటీ బాడీస్ పరీక్ష చేశారు. సాధారణ ప్రజల్లో 92.9 శాతం ఉన్నాయి. హెల్త్ కేర్ వర్కర్క్స్ 93శాతం పాజిటివిటి ఉంది. భద్రాద్రిలో 89.2 యాంటీ బాడీస్ డెవలప్ అయ్యాయన్నారు. హైదరాబాద్ 97 శాతం ప్రజల్లో యాంటీ బాడీస్ ఉన్నాయని, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్లలో 98 శాతం, తీసుకోని వాళ్లలో 77 శాతం యాంటీ బాడీస్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా నిబంధనలు ఎత్తివేయలేదని, మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమాన పోలీసులు విధిస్తారని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..