DH Srinivasa Rao : ఫోర్త్ వేవ్ పై కీలక ప్రకటన..
కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతున్న కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చైనాలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. భారత్లో కూడా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ.. చైనా, తైవాన్, ఈజిప్టు లో కేసులు పెరుగుతున్నాయని, ఢిల్లీ, హర్యానా, యూపీ లో కేసుల సంఖ్య పెరిగిందన్నారు. రాష్ట్రంలో నాలుగు నుంచి ఆరు వారాల్లో ఎలాంటి మార్పు లేదని, 20 నుంచి 25 కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో మాత్రమే 10 నుంచి 15 కేసులు నమోదు అవుతున్నాయని, ఫోర్త్ వేవ్ పై అనేక సందేహాలు ఉండడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయన్నారు.
థార్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, వేసవికాలంలో వేలాది శుభకార్యాలు ఉంటాయి. జాగ్రత్తలు అవసరమన్నారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన వెల్లడించారు. ప్రజలందరూ మాస్క్, సానిటైజేషన్ ఉపయోగించాలని, వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలని ఆయన సూచించారు. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ 100 శాతం తీసుకున్నారని, 60 సంవత్సరాల పైబడిన వారు బుస్టార్ డోస్ తీసుకోవాలన్నారు. తెలంగాణలో ఆర్ వ్యాల్యూ .5శాతమే ఉందని, కానీ మాస్క్ ధరించాలన్నారు. ఫోర్త్ వేవ్ తెలంగాణలోరాదు. సిరో సర్వే ప్రకారం జనవరి 4వ తేదీన నిర్వహించారు.
Also Read
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
14,179 మంది యాంటీ బాడీస్ పరీక్ష చేశారు. సాధారణ ప్రజల్లో 92.9 శాతం ఉన్నాయి. హెల్త్ కేర్ వర్కర్క్స్ 93శాతం పాజిటివిటి ఉంది. భద్రాద్రిలో 89.2 యాంటీ బాడీస్ డెవలప్ అయ్యాయన్నారు. హైదరాబాద్ 97 శాతం ప్రజల్లో యాంటీ బాడీస్ ఉన్నాయని, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్లలో 98 శాతం, తీసుకోని వాళ్లలో 77 శాతం యాంటీ బాడీస్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా నిబంధనలు ఎత్తివేయలేదని, మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమాన పోలీసులు విధిస్తారని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!