Chilkur Balaji Temple: చిలుకూరు ఆలయానికి క్యూ కట్టిన భక్తులు.. భారీ ట్రాఫిక్ జామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ ప్రసిద్ధ దేవాలయం. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో కలియుగ వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అయితే చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవం నిన్నటితో ప్రారంభమయ్యాయి. బాలాజీ ఆలయంలో ఏటా వారం రోజుల పాటు జరిగే బ్రహోత్సవాల్లో భాగంగా తొలిరోజు వేదపండితులు పుట్టమన్నుతో పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల రోజున ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహిస్తారు. ఈరోజు గరుత్మంతునికి నైవేద్యాన్ని సమర్పిస్తారు.
Read also: Google Doodle: లోక్సభ పోల్స్ నేపథ్యంలో ఎన్నికల చిహ్నంతో గూగుల్ డూడుల్..
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
అనంతరం సంతానం లేని మహిళలకు ఈ ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ప్రసాద వితరణ ఉంటుంది. అయితే ఈ ప్రసాదాన్ని కేవలం మహిళలకు మాత్రమే పంచుతారు. అయితే ఆ ప్రసాదం కోసం ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు క్యూలైన్లలో బారులు తీరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో భక్తులు తమ బైక్లు, కార్లను పార్క్ చేసి కిలోమీటర్ల మేర కాలినడకన ఆలయానికి వెళ్తున్నారు.
Read also: CM Revanth Reddy: నేడు మహబూబాబాద్ జన జాతర సభకు సీఎం రేవంత్రెడ్డి..
ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా శ్రీరామ నవమి తర్వాత దశమి రోజు నుంచి ఘనంగా నిర్వహిస్తారు. గురువారం (ఏప్రిల్ 18) సెల్వర్ కూత్తుతో అంకురార్పణ చేశారు. అయితే.. ముందుగా పుట్టమన్ను తీసుకొచ్చి హోమగుండాలు ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఈరోజు (19వ తేదీ) ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహించనున్నారు. రేపు (20న) స్వామివారికి గోపవాహన, హనుమాన్ వాహన సేవలు నిర్వహించనున్నారు.
Read also: Ponnam Prabhakar: తల్లిని రాజకీయాలకి ఎందుకు లాగుతున్నారు.. బండిసంజయ్ పై పొన్నం ఫైర్
ఎల్లుండి (21న) సూర్యప్రభ వాహనం, గరుడవాహనం సేవలు.. అదే రోజు రాత్రి 10.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 22న వసంతోత్సవం, గజవాహన సేవలు, 23న పల్లకి సేవ, అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారి దివ్యరథోత్సవం ఊరేగింపు ఉంటుంది. 24న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వహన సేవ, దోప్సేవ, పుష్పాంజలి సేవలు నిర్వహిస్తారు. చివరి రోజైన 25న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు.
Ponnam Prabhakar: తల్లిని రాజకీయాలకి ఎందుకు లాగుతున్నారు.. బండిసంజయ్ పై పొన్నం ఫైర్
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!