Peddagattu jathara: పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు.. అసౌకర్యాలు కలగకుండా చర్యలు
Peddagattu jathara: తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా పేరు పొందిన సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లిలోని శ్రీ లింగమంతుల స్వామి జాతర, ప్రారంభమై నేటికి రెండోరోజు. నిన్నటి నుంచి శ్రీ లింగమంతుల స్వామి, చౌడమ్మల దర్శనార్థం భక్తుల రాక పెరుగుతూనే ఉంది. అయితే జాతరకు వెలుతున్న ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఉదయం 8:30 దాటినా కూడా రహదారిపై పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. కోదాడ, విజయవాడ, హైదరాబాద్ రహదారిపై పొగ మంచు కమ్ముకుంది. దీంతో రహదారిపై వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్తున్నాయి. సూర్యాపేట సమీపంలోని జరుగుతున్న పెద్దగట్టు జాతరకు వెళ్లే భక్తులు సైతం తమ వాహనాలను చిన్నగా వెళుతున్నారు. దీంతో ఆయా చౌరస్తాల వద్ద ఏర్పాటుచేసిన భారీ గేట్లతో పోలీసులు భక్తులకు సూచనలు ఇస్తున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Read also: Asifabad Bus accident: బస్సునుంచి బయటకు దూకిన డ్రైవర్.. కారణం ఇదే..
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు ఈసారి 15 లక్షల మందికి పైగా భక్త జనం వచ్చే అవకాశం ఉందని పాలకమండలి, దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జాతర మొదటి రోజైనా గంపల ప్రదర్శన రాత్రి నిన్న వైభవంగా నిర్వహించారు. ఇవాళ, రేపు పెద్దగట్టు పైకి భక్తులు పోటెత్తడం ఆనవాయితీగా వస్తంది. ఈ మూడు రోజులలో ఆదివారం రాత్రి నుండి సోమవారం, మంగళవారం సాయంత్రం వరకు పోలీసులకు ట్రాఫిక్ సమస్యను అదుపులో ఉంచడం కత్తి మీద సాములా మారింది. ఈసారి జాతరలో పోలీసుల ముందు చూపుతో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉన్నతాధికారులు పూర్తిస్థాయి చర్యలు శాశ్వతంగా చేపట్టారు. జాతరలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తొలగిపోతుండటంతో రెండవది భక్తుల రద్దీ ని కూడా తగ్గించి, దర్శనం కూడా సజావుగా అయ్యేలా పోలీస్ శాఖ కసరత్తులు చేస్తుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నది. ఈ నెల నుంచి ఐదో రోజులపాటు జాతర సాగనుండగా, 1,800 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. మరో 500 మంది వలంటీర్లను నియమించారు. 60 సీసీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా చేపట్టారు.
MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
తాజావార్తలు
-
Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
-
Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్పై స్పందించిన హోల్డర్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!