Telangana: వానకాలంలో కంకులకు డిమాండ్.. కర్ణాటక, మహారాష్ట్ర దిగుమతి..
- నగరంలో మొక్కజొన్న కంకుల హవా వీస్తోంది..
- చల్లటి వాతావరణంలో కాల్చిన మొక్కజొన్నలను వేడి మంటలు..
- తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర- కర్ణాటక నుంచి కంకులు దిగుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: నగరంలో మొక్కజొన్న కంకుల హవా వీస్తోంది. చల్లటి వాతావరణంలో, వేడివేడి నిప్పులపై కాల్చిన మొక్కజొన్నను ఆరగించడానికి నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు నగరవాసులు. దీంతో కంకులకు మంచి డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్ నగరానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కంకులు దిగుమతి అవుతుంది. ప్రతి సంవత్సరం జూన్లో కంకులు దిగుమతి అయ్యేవి. ఈసారి పంట ఆలస్యంగా రావడంతో జులై నుంచి కంకులతో కళకళలాడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా పాతబస్తీలోని దారుస్సలాం రోడ్డులో కుప్పలు తెప్పలుగా కన్నుల పండువగా సాగుతున్నాయి. చిరు వ్యాపారులు హోల్సేల్గా కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక్కో కంకి ధర రూ.5గా ఉంది.
Read also: CM Revanth Reddy: పరీక్షలు పెట్టకుండా… వాయిదా వేస్తూపోతే వయసైపోతుంది..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ఇదిలా ఉండగా మార్కెట్లో ఈ కంకులు ఒక్కోటి రూ.20. దూర ప్రాంతాల నుంచి నగరానికి తీసుకురావాలంటే రవాణా ఛార్జీల భారం ఎక్కువగా ఉండడంతో ధరలు పెంచాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 20 శాతం మాత్రమే మొక్కజొన్న గింజలు వచ్చాయని, ఇంకా 80 శాతం రావాల్సి ఉందని జమీల్ తెలిపారు. సాధారణంగా, హోల్సేల్ మార్కెట్ ఉదయం 5 నుండి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. మొక్కజొన్న సీజన్ ఆగస్టు నెలాఖరు వరకు ఉంటుందని తెలిపారు. ఈ వర్షాకాలంలో మొక్కజొన్న కంకులు ఎక్కువగా అమ్ముడవుతాయని వ్యాపారులు తెలిపారు. రైతులకు, వినియోగదారులకు నష్టం వాటిల్లకుండా ధరలను నిర్ణయిస్తామని హోల్సేల్ మేనేజర్లు తెలిపారు. ఈ క్రమంలో సికింద్రాబాద్, అబిడ్స్, దిల్షుక్నగర్, ఉప్పల్, కూకట్పల్లి, బేగంపేట మార్కెట్లలో రద్దీగా ఉండే మొక్కజొన్న కంకుల సందడి నెలకొంది. కొంతమంది ఉడికించుకుని తింటుంటే, మరికొందరు వేయించి, మరికొందరు రుచికరమైన ఆహారాన్ని తయారు చేసి కంకులను తీసుకుంటున్నారు. ఏది ఏమైనా వాన కాలంలో టీ,కాఫీ, ఎంత బాగుంటుందో.. కంకులు కూడా కాల్చుకుని తింటుంటే ఆ మజానే వేరబ్బా అంటున్నా కొనుగోలు దారులు.
Dog Breeding: ఇంట్లో కుక్కలను పెంచుకోవడమే కాదు.. ఇవి కూడా చేయాలి..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!