CPI Narayana: గడ్డం పెంచినంత మాత్రానా సన్యాసి కాదు.. నారాయణ సటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గడ్డం పెంచినంత మాత్రానా సన్యాసి కాదంటూ.. జాతీయ కార్యదర్శి సీపీఐ నారాయణ సటైర్ వేశారు. జపాన్ పోతే 14 డ్రెస్ లు మార్చి.. మళ్లీ నేను సన్యాసిని అంటారు మోడీ అంటూ విమర్శించారు. బీజేపీ తెలంగాణ మీద దృష్టి పెట్టిందని మండిపడ్డారు. హిట్లర్ ఎలాగైతే మంచిమాటలు చెప్పి. గెలిచి దేశాన్ని ఆక్రమించినట్టు ఉంది బీజేపీ వ్యవహారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తక్కువ సీట్లు గెలిచిన చోట కూడా అధికారం కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర అయిపోయింది.. ఇప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టారని నిప్పులు చెరిగారు. టీఆర్ ఎస్ నీ చిల్చడమో. లేదంటే లేకుండా చేయడమో చేస్తుందని నారాయణ అన్నారు. మోడీ పార్టీ సమావేశానికి వస్తున్నారు కాబట్టి నిరసన ఏం చెప్పమని అన్నారు. కానీ మోడీని నిలదీయాలని నిర్ణయించామని అన్నారు.
ఫెడరల్ స్ఫూర్తిని నీ దెబ్బతీయాలని మోడీ డిసైడ్ అయ్యారని మండిపడ్డారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో అదే పార్టీ ఉండాలని లేదని అన్నారు. ఆర్ ఎస్ ఎస్ అనుమతించిందా..? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాలను ధ్వంసం చేయడమే మీ పని అయితే.. కార్యవర్గం లో తీర్మానం చేయండని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేనలో అంతర్గత పంచాయతీలో బీజేపీకి ఎం సంబందం అంటూ ప్రశ్నించారు. మొగుడు.. పెళ్ళాల పంచాయితీలు కూడా బీజేపీ చేసేటట్లు ఉందని ఎద్దేవ చేశారు. శివసేన మీద రాజకీయ దాడి ఓ వైపు.. మరో వైపు ఈడీ నోటీసులు ఇస్తుందని అన్నారు. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్ట అంటించుకున్నట్టు ఉంది బీజేపీ వ్యవహారం అని మండిపడ్డారు.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
బీజేపీ..ఈడీ నీ ఇలా రాజకీయాలకు వాడుకోవాలని అమొదిస్తుందా..? అని ప్రశ్నించారు. మేనిఫెస్టో లో పబ్లిక్ సెక్టార్ నీ అమ్మెస్తే అని చెప్పారా..? అంటూ నిలదీసారు. బలహీన ప్రధాని కూడా ఆస్తులు అమ్మలేదు, బలమైన ప్రధాని అని చెప్పే మోడీ 24 పబ్లిక్ ఆస్తులు అమ్మేశారని అన్నారు. 28 మంది బ్యాంకుల లూట్ చేస్తే.. దేశం విడిచి పోతే పట్టించుకోలేదని విమర్శించారు. దేశం విడిచిన వాళ్లంతా గుజరాత్ వాళ్ళే.. కాంగ్రెస్ హయాంలో బ్యాంకులను లూటి చేసిన వాళ్ళను జైల్లో పెట్టారని ఎద్దేవ చేశారు. అప్పుల ఎగవేత దారులు కూడా మోడీ హయాంలో పెరిగిందని విమర్శించారు. పెద్ద నోట్లు రద్దు అని.. బడా కంపెనీల బ్లాక్ మనీ వైట్ అయ్యిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల అవినీతి చిలక కొట్టుడని మండిపడ్డారు.
బీజేపీ అవినీతి హోల్ సేల్ అంటూ విమర్శించారు. నెలకు 75 లక్షలు మేకప్ టీం వాడిని ప్రధాని లేడని మండిపడ్డారు. సోకులు పడు కానీ.. పబ్లిక్ సెక్టార్ నీ ఎందుకు దొచేస్తున్నవంటూ ప్రశ్నించారు. మోడీ..అమిత్ షా నీ మించిన దోషి ఎవరు లేరని ఆగ్రహం వ్యక్తం చేసారు. 18 మందిని తుద ముట్టిస్తే తప్పితే.. మోడీ..అమిత్ షా లు నిర్దోషులు కాలేదని మండిపడ్డారు. సుప్రీం కోర్టు జడ్జిలు కూడా ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో అధికార దుర్వినియోగం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై బీజేపీ జెండాలు అంటూ సటైర్ వేసారు. నోవ టెల్ లో కోటీశ్వరుల పెళ్ళిళ్ళు జరుగుతాయని, బీజేపీ పార్టీ నా.. కార్పొరేట్ కంపెనీ నా..? అంటూ ప్రశ్నించారు. . హిట్లర్ కి పట్టిన గతే మోడీ కి పడుతుందని సీపీఐ నారాయణ ఈ సందర్భంగా మండిపడ్డారు.
Manipur Landslide: 14 మంది మృతి..60 మంది చిక్కుకున్నట్లుగా అనుమానం
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!