Chada Venkat Reddy: మునుగోడులో అందుకే టీఆర్ఎస్కు మద్దతు.. క్లారిటీ ఇచ్చిన చాడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించింది సీపీఐ పార్టీ… కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే కాగా.. బైపోల్లో విక్టరీ కొట్టి.. బీజేపీ దూకుడు బ్రేక్లు వేయాలని భావిస్తోంది టీఆర్ఎస్.. దాని కోసం కలిసివచ్చేవారి మద్దతు తీసుకుంటుంది.. అందులో భాగంగా సీపీఐ మద్దతు కోవడం.. వారు కూడా అంగీకరించడం జరిగిపోయాయి.. ఇవాళ మునుగోడు సభలో సీఎం కేసీఆర్తో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు.. అయితే, మునుగోడులో టీఆర్ఎస్కు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు చాడ.. మీడియాలో మాట్లాడిన ఆయన.. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం గా వచ్చింది.. రాజగోపాల్ రెడ్డి స్వార్దం కోసం పార్టీ మారారు.. ఉప ఎన్నిక ప్రజలపై రుద్దారన్నారు. మేం మునుగోడులో నిలబడాలి.. కానీ, బీజేపీని ఓడించే వారికి మద్దతు ఇవ్వాలి అనుకున్నాం.. అందుకే.. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని క్లారిటీ ఇచ్చారు.
Read Also: Komatireddy Rajgopal Reddy: ఫామ్హౌస్లో పడుకున్న కేసీఆర్.. మునుగోడు రావాలనే రాజీనామా చేశా..
Also Read
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ఇక, సెప్టెంబర్ 4 నుండి సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నాం.. రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణం పై చర్చ ఉంటుందన్నారు.. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ మాది.. తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లడుతున్న పార్టీ మాది అన్నారు చాడ వెంకట్రెడ్డి.. తెలంగాణ భవిష్యుత్ దృష్ట్యా మేం.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నామన్న ఆయన.. బీజేపీని ఓడించే శక్తి టీఆర్ఎస్కే ఉందన్నారు. అందుకే మేం టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చామని తెలిపారు.. బహిరంగ సభకి కేసీఆర్ మమ్మల్ని ఆహ్వానించారు.. ప్రగతి శీల శక్తుల ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. ఇక, భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం సీపీఎం కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన మూడు సీట్లలో కూడా పోటీ పెట్టిందని మండిపడ్డారు.. అప్పట్లో పీసీసీ చీఫ్గా ఉన్న ఉత్తమ్కుమార్ రెడ్డి ఇబ్బంది పెట్టారు.. కాంగ్రెస్ లో బలంతో పాటు బలహీనతలు కూడా ఉన్నాయి.. కానీ, ఆ విషయాలపై ఇప్పుడు మాట్లాడబోనన్నారు చాడ వెంకట్రెడ్డి.
తాజావార్తలు
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!