Chada Venkat Reddy: మునుగోడులో అందుకే టీఆర్ఎస్కు మద్దతు.. క్లారిటీ ఇచ్చిన చాడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించింది సీపీఐ పార్టీ… కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే కాగా.. బైపోల్లో విక్టరీ కొట్టి.. బీజేపీ దూకుడు బ్రేక్లు వేయాలని భావిస్తోంది టీఆర్ఎస్.. దాని కోసం కలిసివచ్చేవారి మద్దతు తీసుకుంటుంది.. అందులో భాగంగా సీపీఐ మద్దతు కోవడం.. వారు కూడా అంగీకరించడం జరిగిపోయాయి.. ఇవాళ మునుగోడు సభలో సీఎం కేసీఆర్తో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు.. అయితే, మునుగోడులో టీఆర్ఎస్కు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు చాడ.. మీడియాలో మాట్లాడిన ఆయన.. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం గా వచ్చింది.. రాజగోపాల్ రెడ్డి స్వార్దం కోసం పార్టీ మారారు.. ఉప ఎన్నిక ప్రజలపై రుద్దారన్నారు. మేం మునుగోడులో నిలబడాలి.. కానీ, బీజేపీని ఓడించే వారికి మద్దతు ఇవ్వాలి అనుకున్నాం.. అందుకే.. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని క్లారిటీ ఇచ్చారు.
Read Also: Komatireddy Rajgopal Reddy: ఫామ్హౌస్లో పడుకున్న కేసీఆర్.. మునుగోడు రావాలనే రాజీనామా చేశా..
Also Read
ఇక, సెప్టెంబర్ 4 నుండి సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నాం.. రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణం పై చర్చ ఉంటుందన్నారు.. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ మాది.. తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లడుతున్న పార్టీ మాది అన్నారు చాడ వెంకట్రెడ్డి.. తెలంగాణ భవిష్యుత్ దృష్ట్యా మేం.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నామన్న ఆయన.. బీజేపీని ఓడించే శక్తి టీఆర్ఎస్కే ఉందన్నారు. అందుకే మేం టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చామని తెలిపారు.. బహిరంగ సభకి కేసీఆర్ మమ్మల్ని ఆహ్వానించారు.. ప్రగతి శీల శక్తుల ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. ఇక, భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం సీపీఎం కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన మూడు సీట్లలో కూడా పోటీ పెట్టిందని మండిపడ్డారు.. అప్పట్లో పీసీసీ చీఫ్గా ఉన్న ఉత్తమ్కుమార్ రెడ్డి ఇబ్బంది పెట్టారు.. కాంగ్రెస్ లో బలంతో పాటు బలహీనతలు కూడా ఉన్నాయి.. కానీ, ఆ విషయాలపై ఇప్పుడు మాట్లాడబోనన్నారు చాడ వెంకట్రెడ్డి.
తాజావార్తలు
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..