Uttam Kumar Reddy: సర్వే ప్రకారం.. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Will Form Govt In Telangana And Center Says Uttam Kumar Reddy: తనకున్న సర్వే ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న ఐదు నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఉద్ఘాటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 84వ రోజుకి చేరుకుంది. గురువారం రాత్రి చందంపేట మండంలోని పాతూరు తండా స్టేజ్ వద్దకు భట్టి విక్రమార్క చేరుకోగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాదయాత్రకు స్వాగతం పలికి, సంఘీభావం ప్రకటించి, పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మండుటెండల్లో భట్టి విక్రమార్క 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం చాలా గ్రేట్ అని కితాబిచ్చారు. భట్టి పాదయాత్ర తమ కాంగ్రెస్ పార్టీకి సరికొత్త జోష్ తీసుకొచ్చిందని తెలిపారు.
Harish Rao: కాంగ్రెస్, బిజెపి వాళ్ళవి మాయమాటలు.. కన్ఫ్యూజ్ చేసి సీట్లు గెలవాలని చూస్తున్నారు
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ప్రజా సమస్యల పరిష్కారం కోసం.. ఈ ఉత్తమ్ ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటాడని అన్నారు. కొందరు అధికారులు గులాబీ కండువా కప్పుకోడమే తక్కువగా ఉందని విమర్శించారు. జనంలో ఉండి, పార్టీ కోసం పోరాడాలంటూ కార్యకర్తల్ని సూచించారు. ఇన్ని సంవత్సరాలైనా.. ఎల్ఎల్బీసీ పూర్తి చేయలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాళేశ్వరంపై పెట్టినంత శ్రద్ధ.. ఇక్కడి ప్రాజెక్టులపై కేసీఆర్ ఎందుకు పెట్టలేదని విమర్శించారు. ఇక్కడి ఎమ్మెల్యేపై ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి, ప్రజల మధ్య ఉండి, వారి కష్టసుఖాలు తెలుసుకోవాలన్నారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, చేపట్టబోయే పథకాల గురించి ప్రజలకు వివరించాలని తెలియజేశారు. తెలంగాణలో రానున్నది తమ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!