Bhatti Vikramarka: నేడు కాంగ్రెస్ పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ.. పాల్గొననున్న ముఖ్య నాయకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: భట్టి విక్రమార్క కాంగ్రెస్ పీపుల్స్ మార్చ్ లో భాగంగా ఇవాళ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఈరోజు కాంగ్రెస్ ప్రజాయాత్ర బహిరంగ సభ నిర్వహించనుంది. భట్టి విక్రమార్క పాదయాత్ర నేటితో 70వ రోజుకు చేరుకున్న సందర్భంగా జడ్చర్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 4: 00 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఇతర నేతలు పాల్గొంటారు. సభ ఏర్పాట్లను పూర్తి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. సభకు నాయకులు, ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
Read also: CM KCR: నేడు సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. పాల్గొననున్న కలెక్టర్లు, ఎస్పీ, సీపీలు
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్.. రాష్ట్రంలోనూ విజయపతాకాన్ని ఎగురవేయాలని భావిస్తోంది. ఇందుకోసం తరచూ సభలు, సమావేశాలు, నిర్వహించాలని నిర్ణయించారు. ఓ వైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తుంటే.. మరోవైపు పీసీసీ వారి నేతృత్వంలో సమావేశాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 800 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఈరోజు భారీ సమావేశం జరగనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో జరిగిన తొలి బహిరంగ సభను హస్తం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలతో మమేకమై వారి సమస్యలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో భాగంగా ఉదండాపూర్, వల్లూరు గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి ప్రాజెక్టుల కోసం భూములు లాక్కుంటుందని భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని భట్టి నిర్వాసితులకు హామీ ఇచ్చారు.
RC 16: అనుకున్న దాని కన్నా ముందుగానే ప్లాన్ చేస్తున్నావా బుచ్చిబాబు?
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!