Bhatti Vikramarka: నేడు కాంగ్రెస్ పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ.. పాల్గొననున్న ముఖ్య నాయకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: భట్టి విక్రమార్క కాంగ్రెస్ పీపుల్స్ మార్చ్ లో భాగంగా ఇవాళ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఈరోజు కాంగ్రెస్ ప్రజాయాత్ర బహిరంగ సభ నిర్వహించనుంది. భట్టి విక్రమార్క పాదయాత్ర నేటితో 70వ రోజుకు చేరుకున్న సందర్భంగా జడ్చర్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 4: 00 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఇతర నేతలు పాల్గొంటారు. సభ ఏర్పాట్లను పూర్తి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. సభకు నాయకులు, ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
Read also: CM KCR: నేడు సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. పాల్గొననున్న కలెక్టర్లు, ఎస్పీ, సీపీలు
Also Read
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
- Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్.. రాష్ట్రంలోనూ విజయపతాకాన్ని ఎగురవేయాలని భావిస్తోంది. ఇందుకోసం తరచూ సభలు, సమావేశాలు, నిర్వహించాలని నిర్ణయించారు. ఓ వైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తుంటే.. మరోవైపు పీసీసీ వారి నేతృత్వంలో సమావేశాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 800 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఈరోజు భారీ సమావేశం జరగనుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో జరిగిన తొలి బహిరంగ సభను హస్తం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలతో మమేకమై వారి సమస్యలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో భాగంగా ఉదండాపూర్, వల్లూరు గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి ప్రాజెక్టుల కోసం భూములు లాక్కుంటుందని భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని భట్టి నిర్వాసితులకు హామీ ఇచ్చారు.
RC 16: అనుకున్న దాని కన్నా ముందుగానే ప్లాన్ చేస్తున్నావా బుచ్చిబాబు?
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!