వారికీ లేని కోవిడ్ మాకే ఉందా..? బీజేపీకి రూల్స్ వర్తించవా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో వరుసగా కీలక సమావేశాలు జరుగుతున్నాయి.. అన్నోజిగూడలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు ఇవాళ్టితో ముగిసిపోయాయి.. అయితే, ఇదే సమయంలో కాంగ్రెస్ మీటింగ్కు అనుమతి ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్.. కాంగ్రెస్ పార్టీ 120 మందితో 9 నుంచి 11 వరకు హైదరాబాద్ శిక్షణ శిబిరాలు పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. 300 మందితో సంఘ్ శిక్షణకు భద్రత, అనుమతి ఇచ్చిందని.. ఇదేమి ద్వంద్వ నీతి, ఢిల్లీలో దోస్తీ ఇప్పుడు గల్లిలో కూడా దోస్తీనా? అంటూ సెటైర్లు వేశారు.. ఇక, ఈ అంశంపై స్పందించిన టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఠాగూర్ చెప్పిన్నట్లు బీజేపీకి వర్తించని కోవిడ్ రూల్స్ కాంగ్రెస్ కే వర్తిస్తాయా..? అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఆర్ఎస్ఎస్ శిక్షణ తరగతులకు సర్కార్ అనుమతి ఇస్తుంది.. కానీ, కాంగ్రెస్ శిక్షణా తరగతులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన ఆయన.. నేనే రాష్ట్ర డీజీపీని అడుగుతున్నా.. బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా కూడా వచ్చారు.. వారికి లేని కోవిడ్ మాకే ఉందా..? అని నిలదీశారు.. సెంట్రల్ పోలీస్, కేంద్ర సర్కార్ బీజేపీది కాబట్టి అనుమతి వస్తుందా..? కాంగ్రెస్ కు.. రాష్ట్రంలో కేంద్రంలో పవర్ లేదని పర్మిషన్ ఇవ్వరా ? అంటూ దుయ్యబట్టారు జగ్గారెడ్డి.. కోవిడ్ నిబంధనలకు లోబడే శిక్షణ తరగతులను నిర్వహిస్తాం.. సంఖ్య పరంగా చూస్తే కాంగ్రెస్ ది 120 నుండి 150 మంది, ఆర్ఎస్ఎస్ వాళ్ల మీటింగ్ కు 300మంది హాజరయ్యారన్న జగ్గారెడ్డి.. ఎక్కడా వాళ్లు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదన్నారు.. వెంటనే ఈ వ్యవహారంపై డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!