Telangana Govt: తెలుగు పాఠ్య పుస్తకాలపై గందరగోళం.. సీఎంగా కేసీఆర్ పేరు..
- విద్యార్దుల పాఠ్యపుస్తకాల పంపిణీ లో గందరగోళం
- ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్-గత మంత్రులు-అధికారుల పేర్లు
- విద్యాశాఖ అధికారులపై మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ఆగ్రహం
- ఫిర్యాదుతో స్పందించిన పాఠశాల విద్యాశాఖ
- పాఠ్యపుస్తకాలను-వర్క్ బుక్స్ ను వెనక్కు తీసుకునేందుకు ఆదేశాలు
Telangana Govt: ఒకటి నుండి 10 వ తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాన్ని, వర్క్ బుక్ లను విద్యార్థుల నుండి వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న స్కూళ్లు రీఓపెన్ కావడంతో.. విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ముందు మాటను మార్చకుండా విద్యాశాఖ ప్రింట్ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందు మాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రా రెడ్డిల పేర్లు 2015లో విద్యాశాఖలో ఉన్న అధికారుల పేర్లు ప్రింట్ చేశారు.
Read also: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
దీంతో ముందు మాట చాప్టర్ వివాదం కావడంతో ఆ పుస్తకాలన్నింటిని వెనక్కి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశం చేసింది. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి పేరు కాకుండా మాజీ సీఎం పేరును పుస్తకాల్లో ప్రస్తావించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి పేరు కాకుండా పాఠ్యపుస్తాకాలు ఎలా ముద్రిస్తారని సీరియస్ అయ్యారు. పిల్లలకు తప్పుదోవ పట్టించుటకే ఇలాంటివి చేస్తున్నారా? అంటూ మండిపడ్డారు. ఈ తప్పిదం ఎవరి వల్ల అయ్యిందనేది దర్యాప్తు చేస్తామని తెలిపారు. తొందరలోనే కొత్త పాఠ్య పుస్తకాలు ప్రింట్ చేసి పిల్లలకు పంచడం జరుగుతుందని అన్నారు.
Read also: CM Chandrababu: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
నారాయణ పేట జిల్లా విద్యార్దుల పాఠ్యపుస్తకాల పంపిణీలో గందరగోళం జరిగిందని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాల్లోని ముందుమాటలో మాజీ సిఎం కేసిఆర్, గత మంత్రులు, అధికారుల పేర్లు ఉండటం గుర్తించి విద్యాశాఖ అధికారులపై ఎమ్మెల్యే శ్రీహరి మండిపడ్డారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శ్రీహారి ఫిర్యాదుతో పాఠశాల విద్యాశాఖ స్పందించింది. పాఠ్యపుస్తకాలని, వర్క్ బుక్స్ ను వెనక్కు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే కొత్త పాఠ్యపుస్తకాలు అందిస్తామని తెలిపింది.
Wife and Husband: నా భార్య అలిగి వెళ్లిపోయింది.. కరెంట్ స్తంభం ఎక్కిన భర్త
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!