Telangana Govt: తెలుగు పాఠ్య పుస్తకాలపై గందరగోళం.. సీఎంగా కేసీఆర్ పేరు..
- విద్యార్దుల పాఠ్యపుస్తకాల పంపిణీ లో గందరగోళం
- ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్-గత మంత్రులు-అధికారుల పేర్లు
- విద్యాశాఖ అధికారులపై మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ఆగ్రహం
- ఫిర్యాదుతో స్పందించిన పాఠశాల విద్యాశాఖ
- పాఠ్యపుస్తకాలను-వర్క్ బుక్స్ ను వెనక్కు తీసుకునేందుకు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Govt: ఒకటి నుండి 10 వ తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాన్ని, వర్క్ బుక్ లను విద్యార్థుల నుండి వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న స్కూళ్లు రీఓపెన్ కావడంతో.. విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ముందు మాటను మార్చకుండా విద్యాశాఖ ప్రింట్ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందు మాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రా రెడ్డిల పేర్లు 2015లో విద్యాశాఖలో ఉన్న అధికారుల పేర్లు ప్రింట్ చేశారు.
Read also: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
దీంతో ముందు మాట చాప్టర్ వివాదం కావడంతో ఆ పుస్తకాలన్నింటిని వెనక్కి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశం చేసింది. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి పేరు కాకుండా మాజీ సీఎం పేరును పుస్తకాల్లో ప్రస్తావించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి పేరు కాకుండా పాఠ్యపుస్తాకాలు ఎలా ముద్రిస్తారని సీరియస్ అయ్యారు. పిల్లలకు తప్పుదోవ పట్టించుటకే ఇలాంటివి చేస్తున్నారా? అంటూ మండిపడ్డారు. ఈ తప్పిదం ఎవరి వల్ల అయ్యిందనేది దర్యాప్తు చేస్తామని తెలిపారు. తొందరలోనే కొత్త పాఠ్య పుస్తకాలు ప్రింట్ చేసి పిల్లలకు పంచడం జరుగుతుందని అన్నారు.
Read also: CM Chandrababu: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
నారాయణ పేట జిల్లా విద్యార్దుల పాఠ్యపుస్తకాల పంపిణీలో గందరగోళం జరిగిందని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాల్లోని ముందుమాటలో మాజీ సిఎం కేసిఆర్, గత మంత్రులు, అధికారుల పేర్లు ఉండటం గుర్తించి విద్యాశాఖ అధికారులపై ఎమ్మెల్యే శ్రీహరి మండిపడ్డారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శ్రీహారి ఫిర్యాదుతో పాఠశాల విద్యాశాఖ స్పందించింది. పాఠ్యపుస్తకాలని, వర్క్ బుక్స్ ను వెనక్కు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే కొత్త పాఠ్యపుస్తకాలు అందిస్తామని తెలిపింది.
Wife and Husband: నా భార్య అలిగి వెళ్లిపోయింది.. కరెంట్ స్తంభం ఎక్కిన భర్త
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!