Co Living Hostels: కో-లివింగ్ హాస్టల్స్ కాదు.. డ్రగ్స్కు అడ్డాలు..
- హైదరాబాద్ రాయదుర్గంలోని కో-లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందా
- కో-లివ్ గార్నెట్ పీజీలో రాజేంద్రనగర్ SOT పోలీసుల దాడులు
- MDMA డ్రగ్ సరఫరా చేస్తున్న డ్రగ్ పెడ్లర్లు, ముగ్గురు వినియోగదారుల అరెస్ట్
- 12 గ్రాముల MDMA, 7 గ్రాముల OG కుష్ గంజాయి, 6 మొబైల్స్ స్వాధీనం.
Co Living Hostels: భాగ్యనగరంలోని ఐటీ హబ్గా పేరుగాంచిన మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పరిసరాల్లోని కో-లివింగ్ హాస్టల్స్ ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం అంజయ్యనగర్లోని ‘కో-లివ్ గార్నెట్ పీజీ హాస్టల్’ వేదికగా జరుగుతున్న డ్రగ్స్ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ (SOT) పోలీసులు, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్లో కో-లివింగ్ హాస్టళ్ల ముసుగులో సాగుతున్న చీకటి వ్యాపారం బయటపడింది. హాస్టల్పై ఆకస్మిక దాడి చేసిన పోలీసు బృందం, అక్కడ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు పెడ్లర్లతో పాటు వాటిని వినియోగిస్తున్న ముగ్గురు కన్జ్యూమర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ దాడుల్లో నిందితుల నుండి పోలీసులు అత్యంత ఖరీదైన 12 గ్రాముల MDMA డ్రగ్స్ , 7 గ్రాముల OG గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్లుగా వ్యవహరిస్తున్న కంభం వంశీ దిలీప్, బాల ప్రకాష్లను పోలీసులు అరెస్ట్ చేయగా, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ మణికంఠ ముచ్చు, రోహిత్ గౌడ్, తరుణ్లకు పరీక్షలు నిర్వహించగా డ్రగ్ పాజిటివ్ అని తేలింది. దీనితో వీరి ఐదుగురిపై ఎన్.డి.పి.ఎస్ (NDPS) చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేశారు. రాయదుర్గం, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో కో-లివింగ్ హాస్టల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, అక్కడ సరైన నిఘా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని డ్రగ్ మాఫియా పాగా వేస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే ‘కో-లివ్ గార్నెట్’ హాస్టల్లో గతంలో కూడా డ్రగ్స్ పట్టుబడటం గమనార్హం.
Also Read
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
మరోవైపు, ఈ డ్రగ్స్ దందాపై ఆరా తీసేందుకు, వార్తలను కవర్ చేసేందుకు వెళ్లిన ఎన్టీవీ (NTV) మీడియా సిబ్బందిపై హాస్టల్ యజమానులు బరితెగించి దౌర్జన్యానికి దిగారు. హాస్టల్ వద్ద దృశ్యాలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను అడ్డుకోవడమే కాకుండా, వారిపై భౌతిక దాడికి ప్రయత్నించి తీవ్రంగా బెదిరించారు. కో-లివింగ్ హాస్టళ్ల యజమానులు ఇంతటి అక్రమాలకు పాల్పడుతూ, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం చేస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో ఐటీ కారిడార్లోని హాస్టళ్లపై పోలీసుల నిఘా మరింత కఠినతరం చేయాలని, అరాచకాలకు పాల్పడుతున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.
Sabarimala Gold Theft: శబరిమల బంగారు దొంగతనంలో వెలుగులోకి సంచలన విషయాలు..!
తాజావార్తలు
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!