Sabarimala Gold Theft: శబరిమల బంగారు దొంగతనంలో వెలుగులోకి సంచలన విషయాలు..!
- శబరిమల ఆలయానికి సంబంధించిన బంగారు దొంగతనంలో
- SIT దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.
- చెన్నైకి చెందిన Smart Creations CEO పంకజ్ భండారి, బళ్లారి జ్యువెలర్ గోవర్ధన్ కీలక నిందితులుగా గుర్తింపు.
- ప్రధాన నిందితులకు సహకరించి నేరాన్ని దాచిపెట్టేందుకు తప్పుడు సాక్ష్యాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala Gold Theft: శబరిమల ఆలయానికి చెందిన బంగారు దొంగతన కేసులో నిందితుల ప్రమేయం, వారి ముఠా నెట్వర్క్కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదిక ప్రకారం చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ సీఈవో పంకజ్ భండారి, బళ్లారికి చెందిన ఆభరణాల వ్యాపారి గోవర్ధన్ ఈ దొంగతనంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. కోలాం విజిలెన్స్ కోర్టులో SIT దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఈ ఇద్దరూ ప్రధాన నిందితులకు సహకరించి నేరాన్ని దాచిపెట్టేందుకు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చినట్లు పేర్కొంది. విచారణలో సేకరించిన ఆధారాల ఆధారంగా వీరిద్దరినీ శుక్రవారం అరెస్ట్ చేసినట్లు SIT వెల్లడించింది. ఈ కేసుకు అంతర్రాష్ట్ర సంబంధాలు ఉన్నాయని కూడా దర్యాప్తులో తేలింది.
OnePlus Turbo కొత్త సిరీస్.. 16GB ర్యామ్, Android 16తో పాటు 9,000mAh బ్యాటరీ
Also Read
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
శబరిమల ఆలయ ద్వారపు ఫ్రేమ్, ద్వారపాలకుల విగ్రహాలపై ఉన్న బంగారు పూత పలకలను మరమ్మతుల పేరిట చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్కు తరలించినట్లు SIT గుర్తించింది. అక్కడి నుంచి బంగారాన్ని వేరు చేసి, దాని ఒక భాగాన్ని బళ్లారి ఆభరణాల వ్యాపారికి విక్రయించినట్లు ఆధారాలు లభించాయి. ఇప్పటికే SIT బళ్లారి ఆభరణాల దుకాణం నుంచి సుమారు 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఇది దొంగతనంలో భాగమేనని అధికారులు చెబుతున్నారు. మిగిలిన బంగారాన్ని దాని ఆధ్యాత్మిక విలువ కారణంగా అధిక ధరకు విక్రయించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
దర్యాప్తు సమయంలో గోవర్ధన్, ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, పంకజ్ భండారి మధ్య వర్తిగా వ్యవహరించినట్లు SIT గుర్తించింది. ఆలయానికి చెందిన బంగారు పూత పలకల నుంచి సేకరించిన బంగారంలో సుమారు 100 గ్రాములను మరమ్మతుల పారితోషికం పేరిట స్మార్ట్ క్రియేషన్స్కు ఇచ్చినట్లు సమాచారం. ఆ బంగారం శబరిమలదేనని భండారికి తెలుసునని కూడా SIT తేల్చింది. ఇదిలా ఉండగా, శబరిమల బంగారు కుంభకోణం దర్యాప్తులో జాప్యంపై కేరళ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 2019లో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) సభ్యులుగా ఉన్న న్యాయవాది ఎన్ విజయకుమార్, కె.పి. శంకర్ దాస్లపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!