Sabarimala Gold Theft: శబరిమల బంగారు దొంగతనంలో వెలుగులోకి సంచలన విషయాలు..!
- శబరిమల ఆలయానికి సంబంధించిన బంగారు దొంగతనంలో
- SIT దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.
- చెన్నైకి చెందిన Smart Creations CEO పంకజ్ భండారి, బళ్లారి జ్యువెలర్ గోవర్ధన్ కీలక నిందితులుగా గుర్తింపు.
- ప్రధాన నిందితులకు సహకరించి నేరాన్ని దాచిపెట్టేందుకు తప్పుడు సాక్ష్యాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala Gold Theft: శబరిమల ఆలయానికి చెందిన బంగారు దొంగతన కేసులో నిందితుల ప్రమేయం, వారి ముఠా నెట్వర్క్కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదిక ప్రకారం చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ సీఈవో పంకజ్ భండారి, బళ్లారికి చెందిన ఆభరణాల వ్యాపారి గోవర్ధన్ ఈ దొంగతనంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. కోలాం విజిలెన్స్ కోర్టులో SIT దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఈ ఇద్దరూ ప్రధాన నిందితులకు సహకరించి నేరాన్ని దాచిపెట్టేందుకు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చినట్లు పేర్కొంది. విచారణలో సేకరించిన ఆధారాల ఆధారంగా వీరిద్దరినీ శుక్రవారం అరెస్ట్ చేసినట్లు SIT వెల్లడించింది. ఈ కేసుకు అంతర్రాష్ట్ర సంబంధాలు ఉన్నాయని కూడా దర్యాప్తులో తేలింది.
OnePlus Turbo కొత్త సిరీస్.. 16GB ర్యామ్, Android 16తో పాటు 9,000mAh బ్యాటరీ
Also Read
- Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
- Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!
- New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
- Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
శబరిమల ఆలయ ద్వారపు ఫ్రేమ్, ద్వారపాలకుల విగ్రహాలపై ఉన్న బంగారు పూత పలకలను మరమ్మతుల పేరిట చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్కు తరలించినట్లు SIT గుర్తించింది. అక్కడి నుంచి బంగారాన్ని వేరు చేసి, దాని ఒక భాగాన్ని బళ్లారి ఆభరణాల వ్యాపారికి విక్రయించినట్లు ఆధారాలు లభించాయి. ఇప్పటికే SIT బళ్లారి ఆభరణాల దుకాణం నుంచి సుమారు 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఇది దొంగతనంలో భాగమేనని అధికారులు చెబుతున్నారు. మిగిలిన బంగారాన్ని దాని ఆధ్యాత్మిక విలువ కారణంగా అధిక ధరకు విక్రయించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
దర్యాప్తు సమయంలో గోవర్ధన్, ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, పంకజ్ భండారి మధ్య వర్తిగా వ్యవహరించినట్లు SIT గుర్తించింది. ఆలయానికి చెందిన బంగారు పూత పలకల నుంచి సేకరించిన బంగారంలో సుమారు 100 గ్రాములను మరమ్మతుల పారితోషికం పేరిట స్మార్ట్ క్రియేషన్స్కు ఇచ్చినట్లు సమాచారం. ఆ బంగారం శబరిమలదేనని భండారికి తెలుసునని కూడా SIT తేల్చింది. ఇదిలా ఉండగా, శబరిమల బంగారు కుంభకోణం దర్యాప్తులో జాప్యంపై కేరళ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 2019లో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) సభ్యులుగా ఉన్న న్యాయవాది ఎన్ విజయకుమార్, కె.పి. శంకర్ దాస్లపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
-
Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!