CM Revanth Reddy: నేడు రాంచీకి రేవంత్.. న్యాయ్ యాత్రలో పాల్గొననున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జార్ఖండ్ వెళ్లనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలో ఆయన పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రాంచీలో జరిగే సభకి సీఎం హాజరు కానున్నారు. అనంతరం రాహుల్గాంధీ చేపట్టిన ‘న్యాయ్ యాత్ర’ ప్రస్తుతం ఝార్ఖండ్లో కొనసాగుతోంది. ఇందులో పాల్గొనేందుకు రేవంత్రెడ్డి ఆ రాష్ట్రం వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి బయలు దేరారు. జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం నెలకొనడంతో ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో క్యాంపు నిర్వహించారు. వీరంతా సమీర్ పేటలోని లియోని రిసార్ట్లో ఉంటున్నారు. బలపరీక్ష నేపథ్యంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయం నుంచి తమ రాష్ట్రానికి వెళ్లినవిషయం తెలిసిందే. దీంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాంచీకి వెళ్లారు. దీంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించాల్సి ఉండగా.. ఈ మేరకు ముందుగా టూర్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. కానీ జార్ఖండ్ రాజకీయ పరిణామాల దృష్ట్యా కొడంగల్ పర్యటనను రద్దు చేసుకున్న రేవంత్ రెడ్డి జార్ఖండ్ వెళ్లనున్నారు.
జార్ఖండ్ ఎమ్మెల్యేలకు గట్టి భద్రత..
Also Read
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల సంకీర్ణ ప్రభుత్వం ఇవాళ శాసనసభలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ కూటమికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను రెండు రోజులు ముందే హైదరాబాద్ శివారులోని సమీర్పేటలోని రిసార్ట్కు తరలించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం రాంచీకి కూడా వెళ్తారు. రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్మున్షీ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్లు వారి భద్రతా విధులను పర్యవేక్షిస్తున్నారు.
Anupama Parameswaran : స్టేజ్ పైనే డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన అనుపమ.. వామ్మో ఇలా చేసిందేంటి?
తాజావార్తలు
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!