CM Revanth Reddy : శిల్పా రామం మేం కడితే… ఆయన పోయి సెల్ఫీలు దిగుతున్నాడు
- రహమత్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో
- శిల్పా రామం మేం కడితే... ఆయన పోయి సెల్ఫీలు దిగుతున్నాడు
- మేము మెట్రో తెచ్చాం జన్వాడ..గజ్వేల్.. ఎర్రవల్లి లో ఫార్మ్ హౌస్ లు కట్టుకున్నారు
- బీజేపీ... అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వదని పిర్యాదు చేశారు : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రహమత్ నగర్లో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. “శిల్పా రామం మేం కడితే… ఆయన పోయి సెల్ఫీలు దిగుతున్నాడు. మేమే మెట్రో తెచ్చాం. కానీ ఇవాళ క్రెడిట్ వేరేవాళ్లు తీసుకుంటున్నారు,” అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తదుపరి మాట్లాడుతూ, “జన్వాడ, గజ్వేల్, ఎర్రవల్లిలో ఫార్మ్హౌస్లు కట్టుకున్నారు. కాదని చెప్పమనండి. 100 బస్సులు పెట్టీ చూపిస్తా. నాలుగు ఫార్మ్హౌస్లు కావాలంటే చెప్పండి… ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చాయి?” అంటూ కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు.
బీజేపీ నేతలపై కూడా రేవంత్ రెడ్డి ధాటిగా స్పందించారు. “బీజేపీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వదని పిర్యాదు చేశారు. కానీ సోనియా గాంధీ ఆదేశాలతో అజారుద్దీన్ను మంత్రిని చేశాం. గుజరాత్లో చేయలేదు కానీ తెలంగాణలో చేశాం. నీకేం ఇబ్బంది కిషన్ రెడ్డి?” అని ప్రశ్నించారు. “బీఆర్ఎస్ వాళ్లు ఎందుకు ఏడుస్తున్నారు? బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరూ ఒక్కటే. కాళేశ్వరం ATM అన్నారు మోదీ, అమిత్ షాలు. సరే, దొంగను పట్టుకోండి అని సీబీఐ విచారణకు ఇచ్చాం. మూడు నెలలు అయినా ఇప్పటివరకు FIR నమోదు చేయలేదు. ఎందుకు? ఎందుకంటే బీజేపీకి కేసీఆర్పై మద్దతు ఉంది,” అని సీఎం రేవంత్ విమర్శించారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
“కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్కు గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ రాసాం. కానీ గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వలేదు. కిషన్ రెడ్డి కేసీఆర్కి లొంగిపోకపోతే, సీబీఐ విచారణ మొదలుపెట్టాలి. 11వ తేదీ లోపు కేసీఆర్, హరీష్లను అరెస్ట్ చేయాలి. బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్లో విలీనం అవ్వడానికి సిద్ధంగా ఉంది. నేను కాదు, కేసీఆర్ బిడ్డనే చెప్పింది,” అని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. “ఒక్కసారి నవీన్ యాదవ్కి అవకాశం ఇవ్వండి. జూబ్లీహిల్స్ ముఖచిత్రం మార్చేస్తా. మీకు అండగా ఉంటా. 30 వేల మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగరనిద్దాం,” అని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!