CM Revanth Reddy : శిల్పా రామం మేం కడితే… ఆయన పోయి సెల్ఫీలు దిగుతున్నాడు
- రహమత్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో
- శిల్పా రామం మేం కడితే... ఆయన పోయి సెల్ఫీలు దిగుతున్నాడు
- మేము మెట్రో తెచ్చాం జన్వాడ..గజ్వేల్.. ఎర్రవల్లి లో ఫార్మ్ హౌస్ లు కట్టుకున్నారు
- బీజేపీ... అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వదని పిర్యాదు చేశారు : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రహమత్ నగర్లో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. “శిల్పా రామం మేం కడితే… ఆయన పోయి సెల్ఫీలు దిగుతున్నాడు. మేమే మెట్రో తెచ్చాం. కానీ ఇవాళ క్రెడిట్ వేరేవాళ్లు తీసుకుంటున్నారు,” అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తదుపరి మాట్లాడుతూ, “జన్వాడ, గజ్వేల్, ఎర్రవల్లిలో ఫార్మ్హౌస్లు కట్టుకున్నారు. కాదని చెప్పమనండి. 100 బస్సులు పెట్టీ చూపిస్తా. నాలుగు ఫార్మ్హౌస్లు కావాలంటే చెప్పండి… ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చాయి?” అంటూ కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు.
బీజేపీ నేతలపై కూడా రేవంత్ రెడ్డి ధాటిగా స్పందించారు. “బీజేపీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వదని పిర్యాదు చేశారు. కానీ సోనియా గాంధీ ఆదేశాలతో అజారుద్దీన్ను మంత్రిని చేశాం. గుజరాత్లో చేయలేదు కానీ తెలంగాణలో చేశాం. నీకేం ఇబ్బంది కిషన్ రెడ్డి?” అని ప్రశ్నించారు. “బీఆర్ఎస్ వాళ్లు ఎందుకు ఏడుస్తున్నారు? బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరూ ఒక్కటే. కాళేశ్వరం ATM అన్నారు మోదీ, అమిత్ షాలు. సరే, దొంగను పట్టుకోండి అని సీబీఐ విచారణకు ఇచ్చాం. మూడు నెలలు అయినా ఇప్పటివరకు FIR నమోదు చేయలేదు. ఎందుకు? ఎందుకంటే బీజేపీకి కేసీఆర్పై మద్దతు ఉంది,” అని సీఎం రేవంత్ విమర్శించారు.
Also Read
- Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..
- Bhatti Vikramarka: పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ.. క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.!
- KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
- Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
“కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్కు గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ రాసాం. కానీ గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వలేదు. కిషన్ రెడ్డి కేసీఆర్కి లొంగిపోకపోతే, సీబీఐ విచారణ మొదలుపెట్టాలి. 11వ తేదీ లోపు కేసీఆర్, హరీష్లను అరెస్ట్ చేయాలి. బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్లో విలీనం అవ్వడానికి సిద్ధంగా ఉంది. నేను కాదు, కేసీఆర్ బిడ్డనే చెప్పింది,” అని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. “ఒక్కసారి నవీన్ యాదవ్కి అవకాశం ఇవ్వండి. జూబ్లీహిల్స్ ముఖచిత్రం మార్చేస్తా. మీకు అండగా ఉంటా. 30 వేల మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగరనిద్దాం,” అని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
AP Cabinet Decisions 2026: బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. 34 శాతం అమలుకు గ్రీన్ సిగ్నల్!
-
Kailash Mystery: కైలాస పర్వతంపై శివుడు ఇప్పటికీ ఉన్నాడా? అసలు ఈ పర్వతాన్ని ఎందుకు ఎవరూ అధిరోహించలేకపోయారు?
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
The Revolutionaries OTT: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నలుగురు వీరులు.. ఓటీటీలోకి హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ సిరీస్
-
Irumudi Censor : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే?
ట్రెండింగ్
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!