CM Revanth Reddy: ఎన్టీఆర్ బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తా..
- బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం..
- పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..
- బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం హామీ..
- ఎన్టీఆర్ ఆలోచనలో 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఎన్టీఆర్ బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని ఇండో-అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో హెల్త్ టూరిజం హబ్ను ప్రకటించారు. అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు హెల్త్ టూరిజం హబ్ ఉంటుందన్నారు. అందులో బసవతారకం ఆసుపత్రికి తప్పకుండా స్థానం ఉంటుంది. వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచంలోని ఎవరైనా హైదరాబాద్కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ ఆలోచనలో ఏర్పాటైన ఈ ఆసుపత్రి 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవ చేయడం ఆనందదాయకమని రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ఈ ఆసుపత్రిని నిర్మించారన్నారు.
Read also: Balakrishana : త్వరలో ఆంధ్రాలో బసవతారకం హాస్పిటల్ ప్రారంభిస్తాం..
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించేందుకు చంద్రబాబు నాయుడు ఆసుపత్రిని పూర్తి చేసి పేదలకు సేవలు అందించడం అభినందనీయమన్నారు. నిరుపేదలకు వైద్యసేవలు అందించాలన్న ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేయడం చూసి స్వర్గం నుంచి మనల్ని ఆశీర్వదిస్తానన్నారు. నిరుపేదలకు క్యాన్సర్ వ్యాధిని నయం చేసేందుకు వైద్యరంగంలో విశేష కృషి చేసిన ఎన్టీఆర్ బసవతారం ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి సహకారం అందించాలన్నా మా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమంలో చంద్రబాబు నాయుడుతో పోటీపడే అవకాశం వచ్చిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలన్నారు. ఎన్టీఆర్కు రాజకీయాలు, సంక్షేమం వారసత్వంగా వచ్చాయి.
Read also: Divi Vadthya : బిగ్ బాస్ బ్యూటీ దివి అందాల జాతర.. ఇది మరో రేంజ్ అంతే.. పిక్స్ వైరల్..
రెండు కిలోల బియ్యంతో బసవతారకం ఆస్పత్రిని నిర్మించి పేదలకు అండగా నిలిచారని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ మొదటి తరం అయితే, రెండో తరం చంద్రబాబు, బాలకృష్ణ అని, మూడో తరం లోకేష్, భరత్ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ మూడో తరం కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. నందమూరి తారక రామారావు భార్య, బాలకృష్ణ తల్లి బసవతారకం క్యాన్సర్తో మరణించారు. ఆ సమయంలో క్యాన్సర్ చికిత్స అందుబాటులో లేదు. దీంతో కేన్సర్ బారిన పడిన పేదలు వైద్యం చేయించుకోలేకపోతున్నారు. అందుకే పేదలకు వైద్య సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ఈ బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించారు. డొనేషన్తో నడిచే ఈ ఆసుపత్రిలో పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది. అందుకే అన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్యాన్సర్ రోగులు వచ్చి చికిత్స పొందుతున్నారు.
Balakrishana : త్వరలో ఆంధ్రాలో బసవతారకం హాస్పిటల్ ప్రారంభిస్తాం..
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?