Mahabubabad: ఇటు కన్న ప్రేమ.. అటు పెంచిన మమకారం.. చిన్నారి కోసం స్టేషన్ కు పేరెంట్స్
- మహబూబాబాద్ లో విచిత్ర ఘటన..
- కవలల్లో ఒకరిని దానం ఇచ్చిన తల్లిదండ్రులు..
- దానం చేసిన చిన్నారి కావాలంటూ పోలీస్టేషన్ కు తల్లిదండ్రులు..
- పెంచుకున్న చిన్నారిని ఇచ్చేది లేదన్న పెంచుకున్న తల్లిదండ్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahabubabad: ఓ కుటుంబంలో కవల పిల్లలు జన్మించారు. అయితే వారిద్దరికి సాకే స్థామత లేక మరొక దంపతులకు ఆస్పత్రిలోనే దానం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ దానం ఇచ్చిన పసికందు కావాలంటూ పోలీస్టేషన్ మెట్లు ఎక్కారు. అయితే మీరు కని మాకు ఇచ్చినప్పటి నుంచి మేము చిన్నారిని ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటున్నామని పెంచుకుంటున్న తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు దానం ఇచ్చిన చిన్నారిని ఎందుకు మళ్లీ అడుగుతున్నారు? అనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది.
దానికి కారణం కవలలు జన్మించిన ఇద్దరిలో ఒకరికి దానం ఇచ్చి మరొకరిని వారిదగ్గర పెంచుకున్నారు. అయితే కొద్దిరోజుల క్రింతం కొందరు కవలలను విడదీయకూడంటూ చెప్పడంతో దీంతో దానం చేసిన చిన్నారిపై కన్న ప్రేమ చిగురించింది. దీంతో ఇప్పుడు దానం చేసిన కూతురు కావాలంటూ పెంచిన తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచారు. వారు స్పందించక పోవడంతో ఆ చిన్నారిని కన్న తల్లిదండ్రులు పోలీస్టేషన్ కు ఆశ్రయించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
Read also: Bridge Collapse: చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జీ.. రూ.కోట్లు నీళ్ల పాలు.. వారంలో రెండో ఘటన
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమర్ సింగ్ తండాకు చెందిన వీరన్న స్వరూప దంపతులు.. నాలుగు సంవత్సరాల క్రితం తొర్రూర్ పట్టణంలోని అమ్మ ఆస్పటల్ లో డెలివరీ కోసం వచ్చి ఇద్దరు ఆడ కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరు కవలలు కావడంతో పక్క బెడ్ లో ఉన్న ఓ దంపతులు పురిటిలోనే పాపను కోల్పోయి బాధతో ఉన్న వారికి ఆడ శిశు వులకు జన్మనిచ్చిన తల్లి కనిపించింది. దీంతో ఒక పాప మాకు కావాలని చెప్పడంతో అంగీకరించిన వీరన్న,స్వరూప దంపతులు ఇద్దరు ఆడ శిశువులను సాధలేక ఒక ఆడ శిష్యుని ఇచ్చారు.
అంతా బాగానే సాగుతున్న సమయంలో ఈమధ్య కాలంలో ఆడ కవలలను విడదీయవద్దు అంటూ ఎవరో చెప్పడంతో తమ పాప కోసం గతంలో తీసుకుపోయిన దంపతుల కోసం వెతికారు. వాళ్ళ ఆచుకి తెలుసుకుని ఫోన్ చేసి మా పాప మాకు కావాలని అడగడం మొదలుపెట్టారు. ఆ దంపతులు పాపనియ్యడానికి నిరాకరించి అలా ఎలా ఇస్తాం మని పెంచుకున్న తల్లి తండ్రులు చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టారు. దీంతో తమ పాపను తమకు ఇప్పించాలంటూ పోలీస్ స్టేషన్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు కన్న తల్లిదండ్రులు. ఇటు పెంచిన ప్రేమ, అటు కన్న మమకారం మధ్యలో ఎవరికి చెప్పాలో తెలియక పోలీసులు సతమతమవుతున్నారు.
Redmi Note 13 Pro: సరికొత్త కలర్లో ‘రెడ్మీ నోట్ 13 ప్రో’.. ధర ఎంతంటే?
తాజావార్తలు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!