CM Revanth Reddy : అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్.. నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతి..!
- వరంగల్ చెరువుల కబ్జాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
- శాఖల సమన్వయ లోపంపై సీఎం ఆవేదన
- ఇళ్లను కోల్పోయిన వారికి తక్షణ సహాయం
- స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేయాలన్న ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : వరంగల్ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, వరద ముంపు పరిస్థితులు, చెరువుల పరిరక్షణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
నాళాలు, చెరువులపై అక్రమ కబ్జాలు చేస్తున్న వారెవరైనా వదలరాదని సీఎం హెచ్చరించారు. “ఎంతటి పెద్దవాళ్లు అయినా కబ్జా చేస్తే వదిలిపెట్టం. ఒక్కరిని కాపాడేందుకు వందలమందిని నష్టపెట్టే పరిస్థితి రావొద్దు,” అని కఠినంగా హెచ్చరించారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్పై ఇరిగేషన్ శాఖ సిద్ధంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Also Read
- Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
- TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఆల్టైమ్ రికార్డు..!
- CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్
- Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
చెరువుల ఇన్ఫ్లో, ఔట్ఫ్లో వివరాలు స్పష్టంగా రికార్డ్ చేయాలని సీఎం ఆదేశించారు. “ఎక్కడి నుంచి నీరు వస్తోంది, ఎక్కడికి వెళ్తోంది అనే లెక్కలు పక్కాగా ఉండాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం సహించం,” అని అధికారులను హెచ్చరించారు. మున్సిపల్, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే వరద ముంపు తీవ్రతకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు.
వరదల కారణంగా ఇళ్లను కోల్పోయిన వారికి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, అర్హుల జాబితా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ముంపు పరిస్థితులు రాకుండా శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. “వాతావరణ మార్పుల కారణంగా క్లౌడ్ బస్ట్లు తరచుగా వస్తున్నాయి. ఇది కొత్త విషయం కాదు. దీనికి శాశ్వత పరిష్కారం ఉండేలా ప్రణాళికలు రూపొందించండి,” అని సీఎం పేర్కొన్నారు.
ఇసుక మేటలు ఏర్పడిన పొలాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద పనులు ప్రారంభించాలని సూచించారు. “ఈ పనులు రైతులకు ఉపాధి కూడా ఇస్తాయి, భూమికి ఉపయోగకరంగా ఉంటాయి,” అని తెలిపారు. వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. “ఎక్కడా పనులు ఆగకూడదు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచే అదనపు నిధులు ఇస్తాం,” అని హామీ ఇచ్చారు. స్మార్ట్ సిటీకి సంబంధించిన ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, అర్బన్ డెవలప్మెంట్ శాఖల మధ్య సమన్వయం కోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. “అధికారులు కార్యాలయాల్లో కూర్చోకుండా ఫీల్డ్లో ఉండాలి. కలెక్టర్లు స్వయంగా ఫీల్డ్ విజిట్ చేసి పరిస్థితులు సమీక్షించాలి,” అని కఠినంగా చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ముంపు నష్టాలు ఎక్కువయ్యాయని సీఎం స్పష్టం చేశారు. “ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకూడదు. అధికారులు సమయానికి స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవు, మేం సీరియస్ గా తీసుకుంటాం, ట్రాన్స్ఫర్ చేస్తారు అనుకుంటుండొచ్చు.. అలా కాకుండా ఎలా చేయాలో తెలుసు..” అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Traffic Rules : హైదరాబాద్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఇక కుదరదు నాయనా..!
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!