CM Revanth Reddy : అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్.. నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతి..!
- వరంగల్ చెరువుల కబ్జాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
- శాఖల సమన్వయ లోపంపై సీఎం ఆవేదన
- ఇళ్లను కోల్పోయిన వారికి తక్షణ సహాయం
- స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేయాలన్న ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : వరంగల్ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, వరద ముంపు పరిస్థితులు, చెరువుల పరిరక్షణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
నాళాలు, చెరువులపై అక్రమ కబ్జాలు చేస్తున్న వారెవరైనా వదలరాదని సీఎం హెచ్చరించారు. “ఎంతటి పెద్దవాళ్లు అయినా కబ్జా చేస్తే వదిలిపెట్టం. ఒక్కరిని కాపాడేందుకు వందలమందిని నష్టపెట్టే పరిస్థితి రావొద్దు,” అని కఠినంగా హెచ్చరించారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్పై ఇరిగేషన్ శాఖ సిద్ధంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
చెరువుల ఇన్ఫ్లో, ఔట్ఫ్లో వివరాలు స్పష్టంగా రికార్డ్ చేయాలని సీఎం ఆదేశించారు. “ఎక్కడి నుంచి నీరు వస్తోంది, ఎక్కడికి వెళ్తోంది అనే లెక్కలు పక్కాగా ఉండాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం సహించం,” అని అధికారులను హెచ్చరించారు. మున్సిపల్, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే వరద ముంపు తీవ్రతకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు.
వరదల కారణంగా ఇళ్లను కోల్పోయిన వారికి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, అర్హుల జాబితా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ముంపు పరిస్థితులు రాకుండా శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. “వాతావరణ మార్పుల కారణంగా క్లౌడ్ బస్ట్లు తరచుగా వస్తున్నాయి. ఇది కొత్త విషయం కాదు. దీనికి శాశ్వత పరిష్కారం ఉండేలా ప్రణాళికలు రూపొందించండి,” అని సీఎం పేర్కొన్నారు.
ఇసుక మేటలు ఏర్పడిన పొలాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద పనులు ప్రారంభించాలని సూచించారు. “ఈ పనులు రైతులకు ఉపాధి కూడా ఇస్తాయి, భూమికి ఉపయోగకరంగా ఉంటాయి,” అని తెలిపారు. వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. “ఎక్కడా పనులు ఆగకూడదు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచే అదనపు నిధులు ఇస్తాం,” అని హామీ ఇచ్చారు. స్మార్ట్ సిటీకి సంబంధించిన ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, అర్బన్ డెవలప్మెంట్ శాఖల మధ్య సమన్వయం కోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. “అధికారులు కార్యాలయాల్లో కూర్చోకుండా ఫీల్డ్లో ఉండాలి. కలెక్టర్లు స్వయంగా ఫీల్డ్ విజిట్ చేసి పరిస్థితులు సమీక్షించాలి,” అని కఠినంగా చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ముంపు నష్టాలు ఎక్కువయ్యాయని సీఎం స్పష్టం చేశారు. “ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకూడదు. అధికారులు సమయానికి స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవు, మేం సీరియస్ గా తీసుకుంటాం, ట్రాన్స్ఫర్ చేస్తారు అనుకుంటుండొచ్చు.. అలా కాకుండా ఎలా చేయాలో తెలుసు..” అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Traffic Rules : హైదరాబాద్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఇక కుదరదు నాయనా..!
తాజావార్తలు
-
Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుకు సంబంధం ఉందా?
-
Explained: రెండూ మెసేజింగ్ యాప్లే కానీ.. వాట్సాప్ను వదిలేసి టెలిగ్రామ్నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
-
Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
-
Viral News : పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరకిన మాజీ ప్రధాని.. వీడియోలు వైరల్!
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?