Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Orders To Clear Lake Encroachments In Warangal

CM Revanth Reddy : అధికారులకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌.. నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతి..!

Published Date :October 31, 2025 , 7:30 pm
By Gogikar Sai Krishna
  • వరంగల్‌ చెరువుల కబ్జాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం
  • శాఖల సమన్వయ లోపంపై సీఎం ఆవేదన
  • ఇళ్లను కోల్పోయిన వారికి తక్షణ సహాయం
  • స్మార్ట్‌ సిటీ పనులు వేగవంతం చేయాలన్న ఆదేశాలు
CM Revanth Reddy : అధికారులకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌.. నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతి..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

CM Revanth Reddy : వరంగల్‌ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్‌ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌ రెడ్డి, వరద ముంపు పరిస్థితులు, చెరువుల పరిరక్షణ, స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

నాళాలు, చెరువులపై అక్రమ కబ్జాలు చేస్తున్న వారెవరైనా వదలరాదని సీఎం హెచ్చరించారు. “ఎంతటి పెద్దవాళ్లు అయినా కబ్జా చేస్తే వదిలిపెట్టం. ఒక్కరిని కాపాడేందుకు వందలమందిని నష్టపెట్టే పరిస్థితి రావొద్దు,” అని కఠినంగా హెచ్చరించారు. ఫ్లడ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై ఇరిగేషన్‌ శాఖ సిద్ధంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Also Read

  • CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్‌.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
  • Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
  • Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
  • Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
Add as a preferred
source on google

చెరువుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలు స్పష్టంగా రికార్డ్‌ చేయాలని సీఎం ఆదేశించారు. “ఎక్కడి నుంచి నీరు వస్తోంది, ఎక్కడికి వెళ్తోంది అనే లెక్కలు పక్కాగా ఉండాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం సహించం,” అని అధికారులను హెచ్చరించారు. మున్సిపల్‌, ఇరిగేషన్‌ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే వరద ముంపు తీవ్రతకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

వరదల కారణంగా ఇళ్లను కోల్పోయిన వారికి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, అర్హుల జాబితా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ముంపు పరిస్థితులు రాకుండా శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. “వాతావరణ మార్పుల కారణంగా క్లౌడ్‌ బస్ట్‌లు తరచుగా వస్తున్నాయి. ఇది కొత్త విషయం కాదు. దీనికి శాశ్వత పరిష్కారం ఉండేలా ప్రణాళికలు రూపొందించండి,” అని సీఎం పేర్కొన్నారు.

ఇసుక మేటలు ఏర్పడిన పొలాల్లో ఎన్ఆర్ఈజీఎస్‌ కింద పనులు ప్రారంభించాలని సూచించారు. “ఈ పనులు రైతులకు ఉపాధి కూడా ఇస్తాయి, భూమికి ఉపయోగకరంగా ఉంటాయి,” అని తెలిపారు. వరంగల్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. “ఎక్కడా పనులు ఆగకూడదు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచే అదనపు నిధులు ఇస్తాం,” అని హామీ ఇచ్చారు. స్మార్ట్‌ సిటీకి సంబంధించిన ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

మున్సిపల్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖల మధ్య సమన్వయం కోసం క్షేత్రస్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. “అధికారులు కార్యాలయాల్లో కూర్చోకుండా ఫీల్డ్‌లో ఉండాలి. కలెక్టర్లు స్వయంగా ఫీల్డ్‌ విజిట్‌ చేసి పరిస్థితులు సమీక్షించాలి,” అని కఠినంగా చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ముంపు నష్టాలు ఎక్కువయ్యాయని సీఎం స్పష్టం చేశారు. “ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకూడదు. అధికారులు సమయానికి స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవు, మేం సీరియస్ గా తీసుకుంటాం, ట్రాన్స్ఫర్ చేస్తారు అనుకుంటుండొచ్చు.. అలా కాకుండా ఎలా చేయాలో తెలుసు..” అని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

Traffic Rules : హైదరాబాద్‌లో రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ ఇక కుదరదు నాయనా..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • encroachments
  • revanth reddy
  • smart city
  • telangana
  • Warangal

తాజావార్తలు

  • Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..

  • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ..! ఇక, కుదరదు..

  • China: జిన్‌పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక ‘అసలు’ మిస్టరీ ఇదేనా!

  • Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?

  • Vijay-Governor: గవర్నర్‌కు విజయ్ మరో షాకింగ్ లెటర్.. మ్యాజిక్ ఫిగర్ ఎంతేశారంటే..!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions