Revanth Reddy: ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఆయన పాతబస్తీ అభివృద్ధితో పాటు అక్కడ చేపట్టే సంక్షేమం వంటి కార్యక్రమాలపై చర్చించినట్టు సమాచారం. అలాగే మూసీ అభివృద్ధి పనులపై కూడా రేవంత్ రెడ్డి చర్చించారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి గ్రేటర్ ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ సమావేశానికి ముందు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాజీ సీఎం సీఎం కేసీఆర్ను పరామర్శించారు. ఇటీవల బాత్రూం కాలు జారి పడిపోయిన కేసీఆర్ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
Also Read: TS Ministers: కేసీఆర్ను పరామర్శించిన మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
కేసీఆర్ను కలిసిన అనంతరం ఎంఐఎం ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకే అన్ని స్థానాలు లభించాయి. దీంతో తొలుత ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశం కావడం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో ఎంఐఎం నేతలతో వాదనలకు దిగిన రేవంత్రెడ్డి అదే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై అభివృద్ధి పనులపై చర్చించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఈ భేటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర నర్సింహాతో పాటు ఇతర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Also Read: సీఎం రేవంత్రెడ్డికి టాలీవుడ్ డైరెక్టర్ బహిరంగ లేఖ
తాజావార్తలు
-
HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
-
Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
-
Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
-
Ben Stokes Returns: ‘క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది’.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
-
Lockup Death: ఏపీలో లాకప్ డెత్లు పరంపర.. రెండు జిల్లాల్లో ప్రకంపనలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!