CM Revanth Reddy : కేసీఆర్కు మేము అన్నం పెడితే మాకు సున్నం పెట్టారు
- కొల్లాపూర్లో రూ.200 కోట్ల యంగ్ ఇండియా స్కూల్కు సీఎం రేవంత్ శంకుస్థాపన
- పాలమూరు అభివృద్ధికి కేసీఆర్ చేసిన అన్యాయంపై ఘాటైన విమర్శలు
- దళిత, ఆదివాసీ పిల్లల విద్య కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : శుక్రవారం (జూలై 18) నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొల్లాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ విద్యాసంస్థకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసభలో మాట్లాడుతూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
“కొల్లాపూర్ సెగ్మెంట్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది,” అని ప్రకటించిన సీఎం రేవంత్, పాలమూరు ప్రజలు దేశంలో ప్రతిభతో నిలుస్తారని గుర్తు చేశారు. 2009లో కేసీఆర్ పాలమూరుకు వలస వచ్చి ఎంపీగా గెలవడం వెనుక ఈ ప్రాంత ప్రజలే ఉన్నారన్నారు. కేసీఆర్ కు మేము అన్నం పెడితే, ఆయన మాకు సున్నం పెట్టారు అని ఆయన విమర్శించారు.
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
Pet Cats Save Woman: మహిళ ప్రాణాలను కాపాడిన పెంపుడు పిల్లులు..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
రేవంత్ మాట్లాడుతూ, “కేసీఆర్ మోసపూరిత పాలన వల్లే పాలమూరు ప్రాంతం వెనుకబడింది. 98వ జీవోలో నిర్వాసితుల సమస్యను ఆయన పట్టించుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోయిన ప్రజలకు సాయం చేస్తానని చెప్పి మోసం చేశాడు,” అని అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి, దానిని కూడా విస్మరించారని ఆరోపించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ సరైన చర్యలు తీసుకోలేదని, “2019లో కాళేశ్వరం నిర్మించి 2023లో కూలిపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనం,” అన్నారు. జూరాల రిపేర్లను పట్టించుకోకపోవడాన్ని కూడా విమర్శించారు.
“పాలమూరులోని దళిత, ఆదివాసీ పిల్లల విద్య కోసం యంగ్ ఇండియా స్కూల్ను నిర్మిస్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధి మా ప్రాధాన్యం,” అన్నారు. “కాంగ్రెస్ 14 సీట్లు గెలిచి ఉంటే మరిన్ని మంత్రిత్వ స్థానాలు వచ్చేవి,” అని చెప్పారు.
కేసీఆర్ పాలనలో పాలమూరుకు అన్యాయం జరిగిందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. “20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పాలమూరు పచ్చబడేది, కానీ ఆయన 10 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేదు,” అని విమర్శించారు.
తాజావార్తలు
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..