CM Revanth Reddy : అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదాం
- కుల గణనలో వంద శాతం ఖచ్చితత్వం ఉందన్న సీఎం
- రిజర్వేషన్ బిల్లులను పెండింగ్లో ఉంచిన రాష్ట్రపతి పై విమర్శ
- 65 లక్షల ఓట్లు తొలగింపు-రాహుల్ గాంధీ బహిర్గతం
- ఓట్ల చోరీకి వ్యతిరేకంగా పాదయాత్రలో పాల్గొననున్న రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణలో కుల గణనను పగడ్బంధీగా నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో సర్వాయి పాపన్న విగ్రహ స్థాపన శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కుల గణనను పూర్తి చేశామని, వందకు వంద శాతం సరిగ్గా లెక్కలు నమోదయ్యాయని తెలిపారు. ఈ గణన లెక్కలను వక్రీకరిస్తే మళ్లీ వందేళ్లైనా రిజర్వేషన్ల వ్యవస్థను సరిచేయడం అసాధ్యమని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా రిజర్వేషన్ బిల్లులను రాష్ట్రపతి ఐదు నెలలుగా ఆమోదించకుండా పెండింగ్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వాయి పాపన్న గౌడ్కి సరైన గుర్తింపు రావాల్సిన సమయం ఇదేనని, ఖిలాషాపూర్ కోటను గత ప్రభుత్వం మైనింగ్ కోసం లీజుకు ఇచ్చిందని సీఎం రేవంత్ విమర్శించారు.
V.N Adithya: ఎవడికిరా నష్టం.. అడుక్కు తినాల్సి వస్తుంది జాగ్రత్త.. సినీ సమ్మెపై దర్శకుడు సంచలనం
Also Read
ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేస్తున్నామంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక ఎన్నికల విషయానికొస్తే, హార్లో 65 లక్షల ఓట్లు తొలగించారని సీఎం రేవంత్ ఆరోపించారు. బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చూపించడం పెద్ద కుట్రలో భాగమని, ఈ అంశాన్ని రాహుల్ గాంధీ బహిర్గతం చేశారని అన్నారు. తప్పు చేసిన వారిని వదిలేసి, దాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీని ఎన్నికల కమిషన్ అఫిడవిట్ అడగడం అన్యాయం అని తీవ్రంగా విమర్శించారు. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని, త్వరలో తాను, ఉప ముఖ్యమంత్రి కలిసి ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఓట్ల చోరీ చేసే కుట్ర తెలంగాణలో కూడా జరుగుతోందని ఆరోపించిన సీఎం, అలాంటి వారిని అంతా కలిసికట్టుగా ఎదిరించి భరతం పడదామని పిలుపునిచ్చారు.
Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ.. విపక్షాలు బాయ్కట్
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!