Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ.. విపక్షాలు బాయ్కట్
- శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై ప్రత్యేక చర్చ
- పార్లమెంట్ నుంచి విపక్షాలు బాయ్కట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అమెరికా నుంచి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్రమంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తాజాగా సోమవారం పార్లమెంట్లో శుభాంశు శుక్ల అంతరిక్ష ప్రయాణంపై పార్లమెంటు ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాను గౌరవించడం పౌరులుగా బాధ్యత అన్నారు. ఈ సమయంలో రాజకీయాలను పక్కకు పెట్టాలని ప్రతిపక్ష నాయకులను కోరారు. ‘‘నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ప్రభుత్వంపైనా… దేశం పట్ల గౌరవం లేకపోయినా… కనీసం అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయుడి పట్ల గౌరవం చూపండి.’’ అని విపక్ష నాయకులను మంత్రి కోరారు. అలాగే కిరణ్ రిజుజు కూడా విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సిందూర్పై చర్చలో పాల్గొన్నట్టుగా ఇప్పుడు కూడా పాల్గొనాలని కోరారు.
ఇది కూడా చదవండి: Pakistan: అసిమ్ మునీర్ వ్యాఖ్యలే రిపీట్ చేసిన పాక్ మంత్రి.. భారత్ను ఎలా పోల్చాడంటే..!
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
వ్యోమగామి శుభాంశు శుక్లాపై లోక్సభలో జరిగిన ప్రత్యేక చర్చకు ప్రతిపక్షాలు దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ మాత్రం సోషల్ మీడియా వేదికగా ప్రశంసలుు కురిపించారు. శుభాంశు శుక్లాను హీరోగా అభివర్ణించారు. గగన్యాన్కు ఒక మెట్టుగా పనిచేసిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mumbai Rains: జలదిగ్బంధంలో ఆర్థిక రాజధాని.. జనజీవనం అస్తవ్యస్తం
జూన్ 25న చేపట్టిన యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. రోదసిలో 18 రోజులు గడిపారు. శుభాంశు శుక్లా బృందం జులై 15న భూమికి తిరిగి వచ్చింది. వచ్చిన వెంటనే వ్యోమగాములను క్వారంటైన్ సెంటర్కు తరలించారు. ఇక సోమవారం మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో కూడా శుభాంశు శుక్లా పాల్గొంటారని వెల్లడించాయి.

తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!