Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ.. విపక్షాలు బాయ్కట్
- శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై ప్రత్యేక చర్చ
- పార్లమెంట్ నుంచి విపక్షాలు బాయ్కట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అమెరికా నుంచి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్రమంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తాజాగా సోమవారం పార్లమెంట్లో శుభాంశు శుక్ల అంతరిక్ష ప్రయాణంపై పార్లమెంటు ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాను గౌరవించడం పౌరులుగా బాధ్యత అన్నారు. ఈ సమయంలో రాజకీయాలను పక్కకు పెట్టాలని ప్రతిపక్ష నాయకులను కోరారు. ‘‘నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ప్రభుత్వంపైనా… దేశం పట్ల గౌరవం లేకపోయినా… కనీసం అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయుడి పట్ల గౌరవం చూపండి.’’ అని విపక్ష నాయకులను మంత్రి కోరారు. అలాగే కిరణ్ రిజుజు కూడా విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సిందూర్పై చర్చలో పాల్గొన్నట్టుగా ఇప్పుడు కూడా పాల్గొనాలని కోరారు.
ఇది కూడా చదవండి: Pakistan: అసిమ్ మునీర్ వ్యాఖ్యలే రిపీట్ చేసిన పాక్ మంత్రి.. భారత్ను ఎలా పోల్చాడంటే..!
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
వ్యోమగామి శుభాంశు శుక్లాపై లోక్సభలో జరిగిన ప్రత్యేక చర్చకు ప్రతిపక్షాలు దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ మాత్రం సోషల్ మీడియా వేదికగా ప్రశంసలుు కురిపించారు. శుభాంశు శుక్లాను హీరోగా అభివర్ణించారు. గగన్యాన్కు ఒక మెట్టుగా పనిచేసిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mumbai Rains: జలదిగ్బంధంలో ఆర్థిక రాజధాని.. జనజీవనం అస్తవ్యస్తం
జూన్ 25న చేపట్టిన యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. రోదసిలో 18 రోజులు గడిపారు. శుభాంశు శుక్లా బృందం జులై 15న భూమికి తిరిగి వచ్చింది. వచ్చిన వెంటనే వ్యోమగాములను క్వారంటైన్ సెంటర్కు తరలించారు. ఇక సోమవారం మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో కూడా శుభాంశు శుక్లా పాల్గొంటారని వెల్లడించాయి.

తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!