CM Revanth Reddy : ఉద్యోగులకు సీఎం రేవంత్ వార్నింగ్.. 15 శాతం కోత
- తల్లిదండ్రుల కోసం జీతాల్లో కోత
- ట్రాన్స్జెండర్లకు కొత్త ఉద్యోగ అవకాశాలు
- నిర్లక్ష్యానికి శిక్షగా ఇంటి సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పిల్లలను పెంచి, చదివించి, జీవితంలో నిలదొక్కుకునేలా చేయడమే కాదు – చివరి దశలో వారికి ఆధారం కావాల్సిన పరిస్థితిలో చాలా మంది పిల్లలు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రులు బాసటకోసం ఎదురు చూస్తున్న ఈ సమాజంలో, కొందరు వారిని భారంగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఈ తరహా ఉదాసీనతపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారి జీతాల్లో నుండి 10-15 శాతం వరకు కోత విధించి, ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాలన్న ప్రతిపాదనపై ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సంబంధిత శాఖల అధికారులు సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఈ నిర్ణయం ప్రజల్లో పెద్దగా చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
- Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
Keerthy Suresh : హీరోలతో సమానంగా మాకు రెమ్యూనరేషన్.. ఇవ్వాలి !
ఇక ట్రాన్స్జెండర్ల పరంగా కూడా సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ విభాగంలో మాత్రమే అవకాశాలు కల్పించగా, ఇకపై రవాణా, ఆరోగ్యం, ఐటీ, ఎండోమెంట్, ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ఆదేశాలిచ్చారు.
ఇటీవల హైదరాబాద్లోని మూసారాంబాగ్లో జరిగిన ఘటన ఇదే సమస్యను చాటింది. 90 ఏళ్ల వృద్ధురాలు శకుంతలాబాయి చేసిన ఫిర్యాదుపై స్పందించిన రెవెన్యూ అధికారులు, ఆమెను పట్టించుకోని కుమారుల ఇంటిని సీజ్ చేశారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేసి, స్పందన లేకపోవడంతో అమలులోకి వెళ్లారు.
ఈ చర్యలు ప్రభుత్వ పరిపాలనలో సామాజిక బాధ్యతకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రుల హక్కులను కాపాడే దిశగా కీలక ముందడుగుగా అభినందనలు పొందుతోంది. ఈ విధానం అమల్లోకి వస్తే, వృద్ధులు మానసిక, ఆర్థిక భద్రతతో జీవించగలరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Star Directors : ఈ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది.. ఇక సినిమాలు తీయరా..?
తాజావార్తలు
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..