Raj Bhavan: ఒకే వేదికపైకి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య క్రమంగా గ్యాప్ పెరుగుతూ వచ్చింది.. ఈ పరిణామాలపై కొన్ని సందర్భాల్లో గవర్నర్ తమిళిసై బహిరంగంగానే పరోక్ష, ప్రత్యక్ష వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారిపోయింది.. కొన్ని రోజులు ఏ విషయాలు బయటకు పొక్కపోయినా.. గ్యాప్ మాత్రం క్రమంగా పెరుగుతూ పోయింది.. దీంతో, గవర్నర్ ఆహ్వానించినా కొన్ని కార్యక్రమాలకు సీఎం కేసీఆర్తో పాటు అధికార పార్టీకి చెందినవారు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, గవర్నర్, ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. ఉదయం 10.05 గంటలకు రాజ్భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు.. అయితే, ప్రొటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది.. ఆయన హాజరైతే చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ను చూసే అవకాశం వచ్చినట్టు అవుతుంది.
Read Also: Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
రాజ్భవన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నట్లు తెలుస్తుంది.. అయితే, గవర్నర్ తమిళిసై వైఖరిపట్ల సీఎం కేసీఆర్, అధికార పార్టీ నేతలు.. గత కొంత కాలంగా రాజ్భవన్కు దూరంగా ఉంటూ వస్తున్నారు.. సీఎం కేసీఆర్ గత ఏడాది అక్టోబరు 11వ తేదీన చివరిసారి రాజ్భవన్కు వెళ్లారు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.. ఇక, అప్పటి నుంచి ఆయన రాజ్భవన్కు వెళ్లింది లేదు.. అయితే, ఇవాళ ఆయన రాజ్భవన్కు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి ఒకే వేదికను పంచుకోనున్న గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్పందన ఎలా ఉంటుంది. అసలు సీఎం ఈ కార్యక్రమానికి హాజరవుతారా..? దూరంగానే ఉంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!