CM KCR: 14 మంది ప్రధానులు మారినా.. దేశ ప్రజల తలరాత మారలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Speech At Telangana Bhavan: స్వాతంత్రం వచ్చిన తర్వాత 14 మంది ప్రధానులు మారారని, అయినా దేశ ప్రజల తలరాత మారలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ సహా పలువురు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రైతుల పోరాటం న్యాయబద్ధమైనదని, తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని చెప్పారు. చిత్తశుద్ధితో పని చేస్తే.. తప్పకుండా గెలిచి తీరుతామని అన్నారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో తానెన్నో ఆటుపోట్లను ఎదుర్కున్నానని, తెలంగాణలో ఏం చేశామో మీరందరూ ఒకసారి చూడండని, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించండి అని రైతు నేతల్ని సూచించారు.
Bank Loan Fraud: ఎస్బీఐకి రూ.95 కోట్ల టోకరా.. నిందితుడి అరెస్ట్..
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
దేశ రాజధాని ఢిల్లీలో రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు పోరాడారని.. ఆ సమయంలో రైతులను ఉగ్రవాదులని, ఖలీస్తానీలని, వేర్పాటవాదులని విమర్శించారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అయితే.. రైతులు వెనకడుగు వేయకుండా తమ పోరాటాన్ని కొనసాగించడంతో, ప్రధాని మోడీ దిగివచ్చిన క్షమాపణ చెప్పారని, ఆ చట్టాలని ఉపసంహరించుకున్నారని తెలిపారు. 750 మంది రైతులు చనిపోతే.. ప్రధాని కనీసం స్పందించలేదని మండిపడ్డారు. మన దేశంలో దేనికి కొదవ లేదని.. అయినప్పటికీ రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రైతులు, చేనేతలు ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకునేవారని.. రైతుల గోస చూసి తన కన్నీళ్లు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని సుస్థిరం చేశామని, దాంతో రైతుల ఆత్మహత్యలు చాలావరకు తగ్గాయని పేర్కొన్నారు. దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి పండితే.. అందులో 56 లక్షల ఎకరాల వరి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే పండుతుందని సీఎం కేసీఆర్ తెలియజేశారు.
Huge Rat: జీవితంలో ఇంత పెద్ద ఎలుకను ఎప్పుడూ చూసి ఉండరు
ఇదిలావుండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్తో పాటు కొందరు రైతు నేతలు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చడునీ, మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మంత్రులు సత్యవతి రాథోడ్, హరీశ్రావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు పలవురు నేతలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!