కేసీఆర్ వ్యూహం మారింది.. ఆ వర్గం ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది.. ఇప్పుడు అందరి నోట దళితుల మాటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత కోసం ఓ ఉద్యమాన్నే బుజాలకు ఎత్తుకున్నారు.. దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.. దీనిని కేవలం ఒక ప్రాంతానికి ఏ ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేయకుండా.. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు.. దళితులకు మరింత ప్రాధాన్యత ఇస్తామని. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ దళితులకు రిజర్వేషన్ కల్పిస్తామని.. అన్ని అంశాల్లోనూ వారికి లబ్ది కలిగేలా చర్యలు తీసుకుంటామంటూ.. హుజూరాబాద్ వేదికగా జరిగిన సభలో ప్రకటించారు సీఎం కేసీఆర్.. సీఎంవోలో దళిత అధికారులు లేరన్న విమర్శలకు కూడా అక్కడి నుంచే చెక్ పెట్టేశారు.. ఏదేమైనా.. దళితుల ఓట్లను గంపగుత్తగా గులాబీ పార్టీకి పడేలా.. గులాబీ బాస్ వ్యూహంగా కనిపిస్తోంది.. ఇక, రాజకీయంగా ఆ వర్గానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.. త్వరలోనే మంత్రివర్గంలోకి దళితులను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.. దీంతో.. ఆ వర్గం ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి.
మరోవైపు.. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. వారికి మరో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ప్రస్తుతం మంత్రివర్గంలో ఒక ఖాళీ ఏర్పడింది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో కొందరిని తప్పించి.. మరికొందరు కొత్తవారికి అవకాశం కల్పించే అవకాశం ఉందంటున్నారు. అలా కొందరిని తప్పించి వారి స్థానంలో దళిత వర్గానికి చెందిన నేతలకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ప్లాన్గా ఉందనే ప్రచారం సాగుతోంది.. ప్రస్తుతం కేబినెట్లో మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతలెవరూ లేరు. మంత్రివర్గ విస్తరణ చేపట్టి ఈ వర్గానికి చెందిన ఇద్దరికి అవకాశం ఇవ్వాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేశారని… ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓ యువ ఎమ్మెల్యేతో పాటు మరో ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. కేబినెట్తో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ దళిత సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా మారిన రాజకీయ పరిస్థితులు.. దళితుల పెరిగిన ప్రాధాన్యతత.. కేబినెట్లోనూ దళిత ప్రజాతినిధులకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారంతో.. ఆ వర్గం ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
Also Read
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
తాజావార్తలు
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!