CM Kcr Delhi Tour: హస్తినలో సీఎం కేసీఆర్.. రాష్ట్రపతి ముర్మును కలిసే అవకాశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిన్న సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్ళిన విషయం తెలిసిందే. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక పరిణామంలో కేసీఆర్ సోమవారం సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. భారత రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడమే కాకుండా, ఆయన కొందరు ప్రతిపక్ష నేతలను కలిసే అవకాశం ఉంది. ఆయన టిఆర్ఎస్ ఎంపీలతో సమావేశమై పాలు, పాల ఉత్పత్తులు, బ్రెడ్ ఇతర నిత్యావసర వస్తువులపై జిఎస్టికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై వారికి మార్గనిర్దేశం చేయనున్నారు. దేశ రాజధానిలో ఉన్న సమయంలో, ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, ఎస్పీ ఎంపీలను కేసీఆర్ కలవాలని యోచిస్తున్నట్లు విశ్వనీయ సమాచారం. రాజకీయ పరిణామాలపై సీఎం చర్చించనున్నారు. ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వాన్ని కైవసం చేసుకునే వ్యూహంపై కొంత సానుకూల ఫలితాలను తెస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
read also: Heavy Rain in Hyderabad: అర్ధరాత్రి భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Also Read
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం వంటి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం క్రియాశీల జోక్యం చేసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కొందరు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రం సమర్పించే అవకాశం ఉంది. కేంద్రం సానుకూలంగా స్పందించకుంటే దేశ రాజధానిలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపారు. అయితే.. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అళ్వాకు మద్దతు కోసం విపక్షాలు దిల్లీలో నిర్వహించే సమావేశానికి సీఎం కేసీఆర్ను ఎన్సీపీ అధినేత శరద్పవార్ ఆహ్వానించినట్లు టాక్.
Heavy Rain in Hyderabad: అర్ధరాత్రి భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
-
Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్పై ట్రంప్ ఆగ్రహం!
-
Babar Azam: ఫామ్లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!