CM KCR: పోడు భూములపై సీఎం కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగింది. ముందుగా స్పీకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు సీఎం. అనంతరం పోడు భూముల విషయంలో సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజనుల గురించి మాట్లాడటం చాలా తేలిక అన్నారు. ఆక్రమణ కాదు.. దురాక్రమణ అంటూ మండిపడ్డారు. అడవి బిడ్డలం అయితే.. అడవి అంతా కొట్టేస్తారా? అంటూ ప్రశ్నించారు. జెండాలు పట్టుకుని ధర్నాలు చేయడం కొన్ని పార్టీలకు అలవాటు అయ్యిందన్నారు. గిరిజనుల హక్కులు కాపాడాల్సిదే కానీ.. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా..కనుమరుగు కావాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. అడవులు ఎవరి పుణ్యంతో నాశనం అవుతున్నాయో చూశామని సీఎం కేసీఆర్ అన్నారు కమ్యూనిస్టులు వచ్చినా.. భట్టి వచ్చినప్పుడు చెప్పిన అన్నారు. పొడు భూములు సాగు చేసుకుంటున్న వారికి ఇస్తాం.. పొడు ఇలాగే కొనసాగాలా ముగింపు ఉండాలా? అంటూ ప్రశ్నించారు. పొడు భూముల పంపిణీ తర్వాత.. ఇంకా భూమి లేని గిరిజనులు ఉంటే గిరిజన బంధు ఇద్దాం అని చెప్పినాని సీఎం తెలిపారు. 11 లక్షల ఎకరాల భూమి పోయిందని, 66 లక్షల ఎకరాల భూమి కాపాడండి అని చెప్పిన అన్నారు. అధికారులకు.. ఓ సారి నిర్ణయం చేసి తేల్చేద్దం అని చెప్పినా అని సీఎం పేర్కొన్నారు.
Read also:Harish rao: అక్కడ మా పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మెడికల్ కాలేజీ ఇచ్చాం
Also Read
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్ష తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
- Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
- Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
సర్పంచ్.. ఎంపీటీసీ.. గిరిజన పెద్దలు.. ప్రతిపక్ష నాయకులు సంతకం పెడితేనె భూముల పట్టా పంపిణీ చేస్తామన్నారు. ఉన్నవి కాకుండా కొత్తగా పొడు చేస్తాం అంటే పట్టాలు ఇవ్వమని స్పష్టం చేశారు. అటవీ అధికారులు పై దాడి చేసి చంపొచ్చా? అని మండిపడ్డారు. పొడు భూములు న్యాయమైన డిమాండ్ కాదన్నారు. ప్రభుత్వం దయతలిసి ఇస్తే తీసుకోవాలి అంతేకాని ఇలా చేయడం సరికాదన్నారు. పొడు భూములు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రైతు బంధు కూడా ఇస్తామన్నారు. పోడు భూముల పట్టాలు ఫిబ్రవరి నెలాఖరులో ఇస్తామన్నారు. కానీ రాత పూర్వకంగా వాళ్ళు మాకు లేఖ ఇవ్వాలని స్పష్టం చేశారు. అటవీ మేమే కాపడుతం అని ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. కొన్ని పార్టీలకు పొడు భూములే దొరికాయని, జెండా పట్టుకుని ధర్నాలు చేసుడు ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తి కోయలు ఇక్కడి వాళ్లే కాదు.. అధికారులను చంపుడు కూడా మంచిది కాదు కదా? అని ప్రశ్నించారు. అట్లా చేస్తాం అంటే మేము చేతులు ముడుచుకుని ఉండం మంటూ మండిపడ్డారు. ఇదే చివరి పంపిణీ… మళ్ళీ ఉండదు అని సీఎం అన్నారు. సాయుధ గస్తీ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కొందరు అగ్ర కులాలు గిరిజన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని అటవీ భూముల అక్రమిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో ఇలాంటివి ఎక్కువ ఉన్నాయని తెలిపారు. వివరాలు సభ ముందు పెట్టమంటే పెడతామన్నారు. ఇకపై పోడు అనేది ఉండదని సభాముఖంగా స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
Formula E Racing: ‘ఫార్ములా-ఇ’ రేసు.. అలరించనున్న సాగరతీరం..
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్ష తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!