Harish rao: ములుగు, సంగారెడ్డిలో మా పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మెడికల్ కాలేజీ ఇచ్చామని శాసన సభలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 2790 కి పెంచామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఏర్పాటు చేసినవి మూడు కాలేజీలు అని, ఆనాడు మూడు ఏర్పాటు చేస్తే, మేము ఒక్క ఏడాదిలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామన్నారు మంత్రి. ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ లోనే 5 మెడికల్ కాలేజీలు వస్తాయని కలలో అయినా అనుకున్నారా? అంటూ ప్రశ్నించారు. ములుగు, సంగారెడ్డిలో మా పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మెడికల్ కాలేజీ ఇచ్చామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇస్తే, ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. నాటి మంత్రులుగా ఉన్న ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి లేఖలు కూడా రాశారని తెలిపారు.
Read also: Formula E Racing: ‘ఫార్ములా-ఇ’ రేసు.. అలరించనున్న సాగరతీరం..
కేంద్రం ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీలు ప్రారంబించారని స్పష్టం చేశారు. బీబీ నగర్ ఎయిమ్స్ పరిస్థితి దారుణంగా ఉందని, ఐపీ లేదు, ఓపీ లేదు, ఆపరేషన్లు చేయరని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భువనగిరి జిల్లా ఆసుపత్రిలో ప్రాక్టికల్స్ చేసే అవకాశం కల్పించామన్నారు. అన్ని జిల్లాల్లో పారామెడికల్ కోర్సులు ప్రారంభిస్తున్నమని, మెడికల్, నర్సింగ్ తో పాటు పారామెడికల్ కాలేజీలు వస్తాయని శుభవార్త చెప్పారు హరీష్ రావు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాడే ఎయిర్ సాంప్లార్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాడుతున్నామన్నారు. 1457 అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీ నెల రోజుల్లో పూర్తి చేసి, మెడికల్ కాలేజీల్లో ఒక్క ఖాళీ లేకుండా చేస్తామన్నారు. ఈ ఏడాదిలోనే మెదక్ కు మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరుగుతుందని, ఫిల్మ్ నగర్ పి.హెచ్.సి కొత్త భవనం మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Pocharam Srinivas Reddy: అందుకే జన్మదిన వేడుకలు రద్దు చేశాను.. కంట తడి పెట్టిన పోచారం..