Karnataka: రోడ్డు ప్రమాదంలో మృతులకు రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాష్ట్రం కలబురిగి బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పార్థీవదేహాలను వారి స్వస్థలానికి తరలించడం.. క్షతగాత్రులకు వైద్య సాయం అందించడం వంటి చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
బస్సు ప్రమాదంలో చనిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కర్ణాటక బస్సు ప్రమాదంల దురదృష్టకరమని అన్నారు. ప్రస్తుతం 16 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారని.. కొందర్ని హైదరాబాద్ నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తామని తలసాని అన్నారు. కర్ణాటక అధికారులతో సీఎం కేసీఆర్, సీఎస్ మాట్లాడారని వెల్లడించారు. బాధిత కుటుంబాలు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఉన్నారని..వారి కుటుంబాలను ప్రభుత్వం తరపున పరామర్శిస్తామని ఆయన వెల్లడించారు.
Also Read
శుక్రవారం ఉదయం కలబురిగి జిల్లా కమలాపురలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కంటైనర్ ట్రక్కును బస్సు ఢీ కొట్టడంతో బస్సుల ప్రయాణిస్తున్న 32 మందిలో నలుగురు సజీవ దహనం కాగా.. మరో నలుగురు ఆసుపత్రికి తరలించే క్రమంలో మొత్తంగా 8 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Anand Deverakonda: ఆ స్టార్ హీరోయిన్పై క్రష్.. ఆనంద్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
National Film Awards: చివరి నిమిషంలో షాక్.. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వాయిదా
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!