CM KCR : చుట్టూ చీకటిలో మణిదీపంలా నా తెలంగాణ వెలుగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ అవిర్భవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 4,01,035 మెగావాట్ల విద్యుత్ శక్తి అందుబాటులో ఉందన్నారు. ఆధునిక సమాజం మొత్తం అభివృద్ధికి సంకేతాలుగా, ప్రగతికి నిదర్శనాలుగా భావించే కొలమానం విద్యుత్ అని, అటువంటి విద్యుత్ శక్తి దేశంలో అందుబాటులో ఉన్నా.. దాన్ని వినియోగించలేని ఆశక్త స్థితిలో భారతదేశం ఉందన్నారు.
4 లక్షల మెగావాట్ల విద్యుత్ శక్తి దేశంలో ఉంటే.. భారతదేశం ఏ రోజు కూడా 2 లక్షలకు మించి విద్యుత్ శక్తిని వాడడం లేదని కేసీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్లో కూడా భరించలేనటువంటి కరెంటు కోతలు, ఎండిపోతున్న పంట పొలాలు, రైతుల రాస్తారోకోలు దర్శనమిస్తున్నాయన్నారు. మన చుట్టూ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో కరెంటు కోతలు లేని రాష్ట్రాలు లేవన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రకటిత కోతలు, అప్రకటిత కోతలతో ఇబ్బందులు పడని ప్రజలే లేరని ఆయన ఉద్ఘాటించారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
చుట్టూ చీకటితో అంధకారం ఉంటే.. ఒక మణి దీపంలా వెలుగుతున్నది నా తెలంగాణ అని గర్వంగా చెప్పుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. 7 ఏళ్ల క్రితం తెలంగాణలో కూడా కరెంటు కోతలు ఉండేవని, కానీ ఆ తెలంగాణ నుంచి ఇప్పుడు 24 గంటలు నిర్వారామంగా కరెంటు ఇచ్చే తెలంగాణగా ఎలా అభివృద్ధి చెందిందో.. అదే దేశంలో ఎందుకు సాధ్యం కావడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!