Bhatti Vikramarka: ప్రభుత్వ ఆస్తులు అమ్మితే చూస్తూ ఊరుకోము..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: ప్రభుత్వ ఆస్తులు అమ్మితే చూస్తూ ఊరుకోమని, రోడ్డుపైకి వచ్చి ఆస్తులు కాపాడుకుంటామని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క హెచ్చరించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై కేసీఆర్ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఇవాళ రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరదలు, పంట నష్టంపై గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్కు వినతిపత్రం అందజేశారు. వరద బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్ తమిళిసైని కలిసిన మల్లు రవి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు. గవర్నర్ను కలిసిన అనంతరం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వరద నష్టాన్ని గవర్నర్కు వివరించామన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి, పంట నష్టం గురించి తెలియజేసినట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా విపత్తులు సంభవించినప్పటికీ, వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైంది.
Read also: Inorbit Mall: విశాఖలో దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్.. శంకుస్థాపన చేసిన సీఎం జగన్
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రజల కోసం పని చేయాల్సిన యంత్రాంగాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని అన్నారు. ఆర్టీసీ ప్రజల ఆస్తి అని అన్నారు. ఆర్టీసీకి ఎన్నో ఆస్తులు సమకూర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మితే చూస్తూ ఊరుకోమని చెప్పారు. రోడ్డుపైకి వచ్చి ఆస్తులు కాపాడుకుంటామని హెచ్చరించారు. కాగా, సోమవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన భట్టి విక్రమార్క.. వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులను డబ్బులు వెచ్చించి ప్రగతి భవన్కు రప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్ బాబు తమ నియోజకవర్గాలు వరదల వల్ల ధ్వంసమైనప్పుడు రెస్క్యూ టీమ్లను పంపాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రాథమిక సాయం అందించడంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
Ambulances: 466 అత్యవసర సేవల వాహనాలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!