Kondagattu : కాషాయ వర్ణంగా మారిన అంజన్న క్షేత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్యాల మండలం కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా హనుమాన్ జయంతి వేడుకలకు హాజరుకాలేకపోయిన భక్తులు శుక్రవారం రాత్రి నుండి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ప్రారంభించారు. అంజన్న సన్నిధిలో దీక్ష విరమించడానికి చిన్న హనుమాన్ జయంతి పవిత్రమైన రోజు అని బలంగా నమ్ముతున్నందున హనుమాన్ దీక్షను తీసుకున్న భక్తులు కొండగట్టు ఆలయంలో దీక్ష విరమించారు.
అంజనేయ స్వామి దీక్షదారులతో కొండగట్టు కాషాయమయంగా మారింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నారు. స్వామి వారి దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పట్టింది.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
మరోవైపు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల్లో తాగునీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, వేసవికాలం ఎండ తీవ్రతం అధికంగా ఉన్న నేపథ్యంలో పాత్ మార్గంలో తాత్కాలిక పండళ్లను కూడా ఏర్పాటు చేశారు. 60 తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలాలు, ఇతర ఏర్పాట్లు కూడా చేశారు. జయంతి వేడుకలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు తగిన బలగాలను మోహరించారు. వేములవాడ నుండి కొండగట్టు వరకు భక్తులను ఉచితంగా తరలించేందుకు వేములవాడ టీఎస్ఆర్టీసీ డిపో అధికారులు 4 మినీ బస్సులను నడుపుతున్నారు.
Special Trains : సికింద్రాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్.. ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
-
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..