CM Chandrababu: మెడికల్ కాలేజీల టెండర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. తగ్గేదేలే..!
- మెడికల్ కాలేజీల టెండర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
- టెండర్స్ ప్రక్రియకు సంబంధించి బిడ్డర్స్ తో సంప్రదింపు జరపాలన్న సీఎం..
- టెండర్స్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, బిడ్డర్స్ తో మాట్లాడాలి..
- కాలేజీ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల వ్యవహారం కూటమి సర్కార్, వైసీపీ మధ్య తీవ్రమైన యుద్ధానికే తెరలేపింది.. పీపీపీ మోడ్ను వ్యతిరేకిస్తూ వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించి.. చివరకు కోటికి పైగా సంతకాలను గవర్నర్కు అందజేసిన విషయం విదితమే కాగా.. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీల టెండర్ల ప్రక్రియపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Shivaji Press Meet: నేను ఎవరితోనూ మిస్ బిహేవ్ చేయలేదు.. నా భార్యకు క్షమాపణలు చెప్పాను..
Also Read
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
అమరావతిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. టెండర్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, బిడ్డర్స్ (టెండర్లో పాల్గొనే సంస్థలు)తో నేరుగా సంప్రదింపులు జరపాలన్న సూచన కూడా చేశారు. ఆదోని మెడికల్ కాలేజీ విషయంలో ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాలేజీ నిర్మాణం త్వరగా ప్రారంభమయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పీపీపీ (Public–Private Partnership) విధానం విజయవంతంగా అమలులో ఉందని గుర్తుచేసిన చంద్రబాబు.. ఏపీలో కూడా మెడికల్ కాలేజీలను అదే విధానంలో నిర్మించి, ప్రజలకు భారంలేకుండా మెరుగైన వైద్య విద్య అందిస్తామని తెలిపారు.
మెడికల్ కాలేజీల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలకం. ఇందులో రాజీ లేదు. ఆలస్యం లేకుండా ముందుకు వెళ్లాలి అని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు.. సీఎం వ్యాఖ్యలతో టెండర్ల ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. వైద్య రంగ విస్తరణలో ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తుండటంతో.. రాష్ట్రంలో వైద్య విద్యకు కొత్త ఊపు రానుంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!