Dasyam Vinay Bhaskar: దేశ ప్రజలందరిచూపు కేసీఆర్ వైపు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు దేశ ప్రజలందరి చూపు తెలంగాణ సీఎం కేసీఆర్ పైనే ఉంది.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రభుత్వ ఛీఫ్ విప్ వినయ్ భాస్కర్.. హనుమకొండ జిల్లా మడికొండలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.. ఈ సమ్మేళనంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్, కార్పొరేటర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మా కార్యకర్తలను కుటుంబసభ్యుల్లా చూస్తున్నారని తెలిపారు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత బలహీన వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేశామని.. 600 సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామన్నారు.. మత్స్య కార్మికులకు ఉచితంగా చేపపిల్లలు ఇస్తున్నామని వెల్లడించిన ఆయన.. 26 వార్డుల్లో 260.1 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేశామన్నారు.. 303 కోట్ల రూపాయలతో నిర్మించిన 505 ఇళ్లు వారం రోజుల్లో అర్హులకు అందిస్తామని ప్రకటించారు.
Read Also: Bomb Threat: చార్మినార్కు బాంబు బెదిరింపు.. పాతబస్తీలో కలకలం
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ఇక, బీసీలను అగౌరవ పరిచే విధంగా భారతీయ జనతా పార్టీ చర్యలు ఉంటున్నాయని మండిపడ్డారు వినయ్ భాస్కర్.. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత దేశ ప్రజలందరూ కేసీఆర్ వైపు చూస్తున్నారన్న ఆయన.. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.. బీసీలను చైతన్యపరచడం కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు.. ఇదే సమయంలో.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపన్నుశాఖ (ఐటీ) దాడులకు భయపడమని హెచ్చిరించారు.. కేంద్ర ప్రభుత్వం కుట్రలు ప్రజల ముందు పెడతామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.. కాగా, తాజాగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో.. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.. మునుగోడులో గెలుపు.. టీఆర్ఎస్లో కొత్త జోష్ని నింపింది..
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?