చెన్నమనేని కేసుపై తెలంగాణ హైకోర్టులో కీలక వాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెన్నమనేని తరపున హైకోర్టు సీనియర్ కౌన్సిల్ వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. సిటిజన్ షిప్ యాక్ట్పై ఆయన కోర్టుకు వివరణ ఇచ్చారు. పౌరసత్వం రద్దు చేయాల్సిన అధికారం సెక్రటరీ, బార్డర్ మేనేజ్మెంట్ మాత్రమే ఇవ్వాలని.. కానీ ఈ కేసులో అండర్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కోర్టుకు వివరించారు. ఇది చట్ట విరుద్ధమని వేదుల వెంకటరమణ కోర్టులో వాదించారు.
Read Also: ఫ్యాక్ట్ చెక్: డిసెంబర్ 31 వరకు భారత్ బంద్
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
సెక్షన్ 10,(2) ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పౌరసత్వం రద్దు చేసే అధికారాలున్నాయని న్యాయవాది వేదుల వెంకటరమణ తెలిపారు. కానీ పిటిషనర్కు అందులో ఉన్న ఏ అంశాలు కూడా వర్తించవన్నారు. చెన్నమనేని టెర్రరిస్ట్ కాదని, సంఘ విద్రోహ శక్తి కాదని సెక్షన్ 10(2) వర్తించదని స్పష్టం చేశారు. చెన్నమనేని సెక్షన్ 5 కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తులో ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం భారత ప్రభుత్వానికి ఉందని వేదుల వెంకటరమణ కోర్టుకు వివరించారు.
ఈ సందర్భంగా ఓవర్ సిస్ ఇండియన్ (OCI) సిటిజన్కు భారత దేశంలో ఎమ్మెల్యే, ఎంపీగా ఫొటో చేసే అధికారం ఉంటుందా అని హైకోర్టు ప్రశ్నించింది. OCI మీద ఎలాంటి పోటీ చేసే అధికారం లేదన్న ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ రావు కోర్టుకు తెలిపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చెన్నమనేని గెలిచారని న్యాయవాది వేదుల వెంకటరమణ గుర్తుచేశారు. నాలుగు సార్లు దురదృష్టవశాత్తు జర్మనీ పాస్పోర్టు మీద గెలిచారన్నా ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవి కిరణ్ రావు వాదించారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!