Chandrababu Naidu: తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక్క టీడీపీకే ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Naidu Speech In Khammam Shankaravam Sabha: తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక్క టీడీపీకే ఉందని.. ఎందుకంటే తెలంగాణలో ప్రాజెక్టులు తీసుకొచ్చింది, హైదరాబాద్ని అభివృద్ధి చేసింది టీడీపీనే అని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో తమకు ఒక్క ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ, ఎంపీ గానీ లేకపోయినా ఇవాళ ఖమ్మం సభకు తరలివచ్చిన ప్రజల్ని చూస్తుంటే ధైర్యం కలుగుతోందన్నారు. తెలంగాణలో చురుగ్గా లేని టీడీపీ నేతలు.. ఈ సభను చూసైనా క్రియాశీలకంగా మారాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో టీడీపీ ఎక్కడా? అని ప్రశ్నించే వాళ్లకు ఖమ్మం సభే సమాధానమని స్పష్టం చేశారు.
Chada Venkat Reddy: బీఆర్ఎస్ విధివిధానాల్ని చెప్పాకే.. నిర్ణయం తీసుకుంటాం
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని, భవిష్యత్తుకు నాంది పలకబోతోందని చెప్పిన చంద్రబాబు.. నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు, శక్తి అని కీర్తించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుతో ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం అందించారని.. మండల వ్యవస్థ, సింగిల్ విండో విధానం అమలు చేసి పేదలకు పక్కా భవనాలు నిర్మించి ఇచ్చారని చెప్పారు. తాను కోరుకున్నది అధికారం కాదని, ప్రజల అభిమానమని.. ఎన్నికలు, ఓట్ల కోసం తానెప్పుడూ పని చేయలేదని అన్నారు. తాను వయసులో పెద్దవాడినైనా యువత కంటే ముందు చూపుతో ఆలోచిస్తానని.. ఐటీ రంగం ప్రాధాన్యతను తాను 25 ఏళ్ల క్రితమే గుర్తించానని పేర్కొన్నారు. బిల్ గేట్స్ని కలిసి.. భారతీయుల మేధాశక్తి ఎలాంటిదో వివరించానన్నారు. డిజిటల్ సత్తాలో మనతో పోటీ పడేవాళ్లు ఎవరూ లేరన్నారు.
Puri Jagannadh: మరో బాంబ్ పేల్చిన పూరి.. ప్రేమికులు రెండు సార్లు అది చేసుకోండి
ఇదే సమయంలో రాష్ట్ర విభజన గురించి చంద్రబాబు మాట్లాడుతూ.. కొందరు చేతకాని వ్యక్తులు ఏపీని మళ్లీ తెలంగాణలో కలిపేస్తామని అంటున్నారని, అది జరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఏపీ రెండు రాష్ట్రాలుగా మారినా.. తాను వేసిన ఫౌండేషన్నే తెలంగాణలో కొనసాగించారన్నారన్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసి, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలన్న ఆశ ఉందన్న ఆయన.. ఏపీలో గాడి తప్పిన పాలనను ఆదుకోవాలని కాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, కలిసి పని చేస్తే దేశానికే ఆదర్శం అవుతాయన్నారు. 40 ఏళ్లు ఏ ప్రజలైతే తనను ఆశీర్వదించారో.. వారి కోసం జీవితాంతం పనిచేస్తానని చెప్పారు. పార్టీ అవసరమనుకున్న వాళ్లు పార్టీలోకి రావాలని.. మళ్లీ తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావాలని చంద్రాబాబు కోరారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..