Telangana : కుల ధ్రువీకరణ పత్రాల జారీకి కొత్త విధానం
- కుల ధ్రువీకరణ పత్రాల జారీకి కొత్త విధానం
- మీ సేవ కేంద్రాల్లో అందుబాటులో సౌకర్యం
- అధికారుల చర్చలతో రూపుదిద్దుకున్న విధానం
- ప్రజలకు తక్షణ ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్లు పొందడానికి దరఖాస్తు చేసి, ఎమ్మర్వో ఆమోదం కోసం వేచి చూడాల్సి వచ్చేది. ఎమ్మర్వో అందుబాటులో లేకపోతే లేదా ఇతర పరిపాలన సమస్యల వల్ల ఈ ధ్రువీకరణ పత్రం కోసం వారం నుంచి రెండు వారాల వరకు సమయం పట్టేది. ఈ జాప్యాన్ని తొలగించి ప్రజలకు తక్షణ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఇకపై బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు నేరుగా తమ సమీపంలోని మీ సేవ కేంద్రాల నుంచే కుల ధ్రువీకరణ పత్రాలను పొందగలరు. ఈ కొత్త విధానం గత 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు.
కొత్త విధానం రూపకల్పన
Also Read
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు మీ సేవ విభాగం, సీసీఎల్ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, జిల్లా పరిపాలనాధికారులు, తహసీల్దార్లు కలిసి పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల అనంతరం కొత్త పద్ధతికి రూపం ఇవ్వబడింది. అధికారులు తెలిపిన ప్రకారం, గత 15 రోజులలోనే 17,571 మంది పౌరులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని వెల్లడించారు.
ఎలా పొందాలి?
మీ దగ్గర పాత కుల ధ్రువీకరణ పత్రం నెంబర్ ఉంటే, ఆ నెంబర్ను మీ సేవ కేంద్రంలో చెప్పగానే కొత్త ప్రింటవుట్ను వెంటనే పొందవచ్చు.
ఒకవేళ ఆ నెంబర్ గుర్తు లేకపోతే, మీ జిల్లా, మండలం, గ్రామం, ఉపకులం, పేరు ఆధారంగా సిబ్బంది రికార్డుల్లో శోధించి ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు.
మరిన్ని వివరాల కోసం అధికారిక మీ సేవ వెబ్సైట్ లేదా సమీపంలోని మీ సేవ కేంద్రంను సంప్రదించవచ్చు.
ఈ కొత్త విధానం వల్ల పౌరులు ఇక జాప్యం లేకుండా తక్షణమే తమ కుల ధ్రువీకరణ పత్రాలను పొందగలుగుతున్నారు. ముఖ్యంగా పేదలు, విద్యార్థులు, ఉద్యోగార్థులు, సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా మారనుంది.
AP People Returned From Nepal: రాష్ట్ర ప్రభుత్వం చొరువతో స్వస్థలాలకు చేరుకున్న తెలుగు ప్రజలు!
తాజావార్తలు
-
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
-
Indian Railways: రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు.. కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
-
AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!