Malothu Kavitha: నేను పార్టీ మారడం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాలోత్ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malothu Kavitha: పార్టీ మారడం లేదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత క్లారిటీ ఇచ్చారు. తనపైన రాజకీయ అత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారను… పోటీలోనే ఉంటానని స్పష్టం చేశారు మాలోతు కవిత. పార్టీ గెలిచే స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి అని.. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఆమె అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తగా కార్యాచరణతో ముందుకు సాగాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కార్మికులను ఆదుకునే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోతుందన్నారు. తాగు, సాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలని సూచించారు.
Read also: Komatireddy: హరీష్ రావ్ బీజేపీలో చేరడం ఖాయం.. కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
మాలోత్ కవిత.. నవంబర్ 4, 2014 న, తన తండ్రి రెడ్యా నాయక్తో కలిసి కాంగ్రెస్ నుండి BRS లో చేరారు. 2019లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బలరానాయక్పై 1.50 లక్షల మెజార్టీతో గెలుపొంది తన సత్తా చాటారు. 2019లో 17 ఎంపీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా, గెలిచిన ఏకైక మహిళా ఎంపీగా కవిత మాలోత్ చరిత్ర సృష్టించారు. 19 సెప్టెంబర్ 2019న ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా, మహిళా సాధికారత కమిటీ సభ్యురాలుగా, 9 అక్టోబర్ 2019న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. అలాగే.. 26 జనవరి 2022న ఆమె అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. మహబూబాబాద్ జిల్లా బి.ఆర్.ఎస్. లంబాడా నుంచి దేశంలోనే తొలి మహిళా ఎంపీగా గుర్తింపు పొందారు. మహబూబాబాద్ పార్లమెంట్ నేతలతో అనుబంధం ఉంటూ పరిపాలనను సమర్థంగా నడిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, వచ్చే ఎన్నికల్లో మహబూబాబాద్ స్థానం నుంచి మళ్లీ ఆమె అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసింది.
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!