Defection MLA : నేడు ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు
- ఐదుగురు ఎమ్మెల్యేలపై తొలి దశ తీర్పు
- సుప్రీంకోర్టు గడువు ముగియడంతో స్పీకర్ నిర్ణయం
- పార్టీ ఫిరాయింపులపై ఆధారాల్లేవన్న చర్చ
- గురువారం సుప్రీంకోర్టు విచారణపై ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ బుధవారం తొలి దశ తీర్పును ప్రకటించనున్నారు. మొదటగా ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పష్టత ఇవ్వనున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. తొలిదశలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్రెడ్డి, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించనున్నారు. ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువు గురువారంతో ముగియనుంది. దీంతో గడువు ముగిసేలోగా స్పీకర్ తీర్పు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన ఫిర్యాదులపై స్పీకర్ నెలలపాటు విచారణ జరపకుండా ఆలస్యం చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు నెలల్లోగా తేల్చాలని జూలై 31న ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అక్టోబర్ 21తో గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్రంగా మండిపడింది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని వ్యాఖ్యానించింది.
Also Read
అంతేకాదు, గత నెల 17న నాలుగు వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని తుదిగడువు విధిస్తూ కఠిన వ్యాఖ్యలు చేసింది. నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్కు ఇబ్బందులు తప్పవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై బుధవారం తీర్పు వెలువరించనున్నారు. వీరు పార్టీ ఫిరాయించారనేందుకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ అనర్హత వర్తించదని స్పీకర్ ప్రకటించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఐదుగురిపై తీర్పు ఇచ్చిన అనంతరం, మిగిలిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కావాలని స్పీకర్ సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా, పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు ఎనిమిది మంది మాత్రమే సమాధానాలు సమర్పించారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ను నేరుగా కలిసి మరికొంత సమయం కోరగా, దానం నాగేందర్ ఇప్పటివరకు స్పందించలేదు. గురువారం జరగనున్న సుప్రీంకోర్టు విచారణపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
IND vs SA 4th T20I: నేడే నాల్గవ టీ20.. టీమిండియా సిరీస్ గెలుస్తుందా..?
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!