Harish Rao: ఖమ్మం సభా వేదికపై వారు మాత్రమే ఉంటారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభగా ఖమ్మం సభ నిలిచిపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఈనెల 18న ఖమ్మం సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో కేసీఆర్ కరీంనగర్ లో సింహగర్జన నిర్వహించారని, బీఆర్ ఎస్ తొలి సభను ఖమ్మంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఖమ్మం సభలో పలు జాతీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు. ఖమ్మం ప్రజల పోరాటం, మలి దశ ఉద్యమంలో పాల్గొన్న తీరు మరువలేనిదన్నారు. వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని నిర్మించారని పేర్కొన్నారు. 448 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశామని, 20 పార్కింగ్ స్థలాలను గుర్తించామని పేర్కొన్నారు.
Read also: Stone Pelting: చిచ్చుపెట్టిన చికెన్..! రెండు వర్గాల మధ్య దాడులు
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
సభలో వేలాది మంది వలంటీర్లు పాల్గొంటారని, ఎమ్మెల్యేల నేతృత్వంలో నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తామన్నారు. ఎక్కువగా 13 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ నిర్వహిస్తామని చెప్పారు. మహబూబాబాద్, సూర్యాపేట నుంచి ఎక్కువ మంది జనం వస్తున్నారు. ఖమ్మం చరిత్రలో పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, కేసీఆర్ను ఆశీర్వదించేందుకు సభకు తరలిరావాలని తహతహలాడుతున్నారన్నారు. అందుబాటులో ఉన్న వాహనాల్లో ప్రజలను తరలించడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఖమ్మం సభకు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతుందని, డయాస్ ఎదుట ముఖ్య నేతలకు ప్రత్యేక సెక్టార్ కేటాయించామని అన్నారు.
Read also: Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్త? అప్పట్లో సంచలనం
సీఎంతో వేదికపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు మాత్రమే ఉంటారని తెలిపారు. కేసీఆర్.. మిగిలిన మంత్రులు, నాయకులు ఎజెండాలో ముందుగా కూర్చుంటారు. మంత్రి తలసాని రిసీవింగ్, సెండాఫ్ బాధ్యతను అఖిలేష్ యాదవ్ కు అప్పగించారన్నారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంల ప్రోటోకాల్ను మంత్రి మహమూద్ అలీ చూసుకుంటారని, కేరళ సీఎం ప్రశాంత్రెడ్డి, డి.రాజాలను రిసీవ్ చేసుకునే బాధ్యత పార్టీ నేత దాసోజు శ్రవణ్దేనన్నారు. ఇవాళ రాత్రికి నేతలంతా హైదరాబాద్ చేరుకుంటారని, 18న సీఎంతో అల్పాహారం అనంతరం దేశ రాజకీయాలపై చర్చిస్తారని తెలిపారు. సీఎంతో పాటు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం ఉంటుందని, దర్శనానంతరం రెండు హెలికాప్టర్లలో ఖమ్మం సభకు బయలుదేరి వెళతారని తెలిపారు. సమావేశంలో పాల్గొనే ముందు కలెక్టరేట్లో రెండు దశల కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
Father Lust on Daughter: ఛీ..ఛీ.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం.. గర్భం దాల్చడంతో..
తాజావార్తలు
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!