Harish Rao: ఖమ్మం సభా వేదికపై వారు మాత్రమే ఉంటారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభగా ఖమ్మం సభ నిలిచిపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఈనెల 18న ఖమ్మం సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో కేసీఆర్ కరీంనగర్ లో సింహగర్జన నిర్వహించారని, బీఆర్ ఎస్ తొలి సభను ఖమ్మంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఖమ్మం సభలో పలు జాతీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు. ఖమ్మం ప్రజల పోరాటం, మలి దశ ఉద్యమంలో పాల్గొన్న తీరు మరువలేనిదన్నారు. వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని నిర్మించారని పేర్కొన్నారు. 448 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశామని, 20 పార్కింగ్ స్థలాలను గుర్తించామని పేర్కొన్నారు.
Read also: Stone Pelting: చిచ్చుపెట్టిన చికెన్..! రెండు వర్గాల మధ్య దాడులు
Also Read
- Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
- Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
సభలో వేలాది మంది వలంటీర్లు పాల్గొంటారని, ఎమ్మెల్యేల నేతృత్వంలో నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తామన్నారు. ఎక్కువగా 13 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ నిర్వహిస్తామని చెప్పారు. మహబూబాబాద్, సూర్యాపేట నుంచి ఎక్కువ మంది జనం వస్తున్నారు. ఖమ్మం చరిత్రలో పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, కేసీఆర్ను ఆశీర్వదించేందుకు సభకు తరలిరావాలని తహతహలాడుతున్నారన్నారు. అందుబాటులో ఉన్న వాహనాల్లో ప్రజలను తరలించడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఖమ్మం సభకు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతుందని, డయాస్ ఎదుట ముఖ్య నేతలకు ప్రత్యేక సెక్టార్ కేటాయించామని అన్నారు.
Read also: Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్త? అప్పట్లో సంచలనం
సీఎంతో వేదికపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు మాత్రమే ఉంటారని తెలిపారు. కేసీఆర్.. మిగిలిన మంత్రులు, నాయకులు ఎజెండాలో ముందుగా కూర్చుంటారు. మంత్రి తలసాని రిసీవింగ్, సెండాఫ్ బాధ్యతను అఖిలేష్ యాదవ్ కు అప్పగించారన్నారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంల ప్రోటోకాల్ను మంత్రి మహమూద్ అలీ చూసుకుంటారని, కేరళ సీఎం ప్రశాంత్రెడ్డి, డి.రాజాలను రిసీవ్ చేసుకునే బాధ్యత పార్టీ నేత దాసోజు శ్రవణ్దేనన్నారు. ఇవాళ రాత్రికి నేతలంతా హైదరాబాద్ చేరుకుంటారని, 18న సీఎంతో అల్పాహారం అనంతరం దేశ రాజకీయాలపై చర్చిస్తారని తెలిపారు. సీఎంతో పాటు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం ఉంటుందని, దర్శనానంతరం రెండు హెలికాప్టర్లలో ఖమ్మం సభకు బయలుదేరి వెళతారని తెలిపారు. సమావేశంలో పాల్గొనే ముందు కలెక్టరేట్లో రెండు దశల కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
Father Lust on Daughter: ఛీ..ఛీ.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం.. గర్భం దాల్చడంతో..
తాజావార్తలు
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!