Malkajigiri BRS: హరీష్ రావుపై తీవ్ర విమర్శలు.. మైనంపల్లి స్థానంలో మరో అభ్యర్థి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malkajigiri BRS: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో తీవ్ర కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తొలి దశ జాబితా ప్రకటించినప్పటి నుంచి హరీష్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో హన్మంతరావుపై బీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇప్పటికే ఆయనకు పార్టీ టికెట్ కేటాయించగా.. అభ్యర్థి మార్పు ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనట్లు సమాచారం. మల్కాజిగిరి సీటుతో పాటు మెదక్ సీటు కూడా తన కుమారుడికి ఇవ్వాలని హన్మంతరావు గత కొంతకాలంగా కోరుతున్నారు. ఇదే అంశంపై ఆయన ఈ నెల 21న కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తును చాలా మంది నాశనం చేశారని, తన కుమారుడికి టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రబ్బర్ చెప్పులతో వచ్చిన వ్యక్తి లక్షల కోట్లు సంపాదించాడని తిరుమలలో హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ టిక్కెట్లు ప్రకటించే ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ జాబితాలో మైనంపల్లి పేరు ఉంది.
Read also: Telangana Cabinet: రేపు కేబినెట్ విస్తరణ.. పట్నం మహేందర్రెడ్డికి చోటు..!
Also Read
అయితే మైనంపల్లి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ను మీడియా ప్రశ్నించగా.. తామే టికెట్ ఇచ్చామని చెప్పారు. మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తదితరులు స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ.. తాము హరీష్ వెంట ఉంటామన్నారు. తదనంతర పరిణామాల్లో మైనంపల్లి కాంగ్రెస్ వైపు వెళ్తున్నారనే టాక్ వచ్చింది. అయితే మంగళవారం తిరమలలో మరోసారి మీడియాతో మాట్లాడిన మైనంపల్లి.. తన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, తానెప్పుడూ పార్టీని విమర్శించలేదని అన్నారు. హైదరాబాద్ రాగానే తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు ముఖ్యమని.. తాను దేనికీ భయపడనని హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్ఠానం మల్కాజిగిరి అభ్యర్థి మార్పు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి మైననంపల్లి హనుమంతరావును తప్పించి ఆ స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలి. దీనికి మర్రి రాజశేఖర్ రెడ్డితోపాటు మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. విజయావకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థినే పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు మైనంపల్లి హనుమంతరావుతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Milk Shake : మిల్క్ షేక్ తాగుతున్నారా..? ఇది ఒక్కసారి చదివితే జన్మలో తాగరు..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!