Malkajigiri BRS: హరీష్ రావుపై తీవ్ర విమర్శలు.. మైనంపల్లి స్థానంలో మరో అభ్యర్థి..!
Malkajigiri BRS: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో తీవ్ర కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తొలి దశ జాబితా ప్రకటించినప్పటి నుంచి హరీష్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో హన్మంతరావుపై బీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇప్పటికే ఆయనకు పార్టీ టికెట్ కేటాయించగా.. అభ్యర్థి మార్పు ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనట్లు సమాచారం. మల్కాజిగిరి సీటుతో పాటు మెదక్ సీటు కూడా తన కుమారుడికి ఇవ్వాలని హన్మంతరావు గత కొంతకాలంగా కోరుతున్నారు. ఇదే అంశంపై ఆయన ఈ నెల 21న కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తును చాలా మంది నాశనం చేశారని, తన కుమారుడికి టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రబ్బర్ చెప్పులతో వచ్చిన వ్యక్తి లక్షల కోట్లు సంపాదించాడని తిరుమలలో హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ టిక్కెట్లు ప్రకటించే ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ జాబితాలో మైనంపల్లి పేరు ఉంది.
Read also: Telangana Cabinet: రేపు కేబినెట్ విస్తరణ.. పట్నం మహేందర్రెడ్డికి చోటు..!
Also Read
అయితే మైనంపల్లి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ను మీడియా ప్రశ్నించగా.. తామే టికెట్ ఇచ్చామని చెప్పారు. మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తదితరులు స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ.. తాము హరీష్ వెంట ఉంటామన్నారు. తదనంతర పరిణామాల్లో మైనంపల్లి కాంగ్రెస్ వైపు వెళ్తున్నారనే టాక్ వచ్చింది. అయితే మంగళవారం తిరమలలో మరోసారి మీడియాతో మాట్లాడిన మైనంపల్లి.. తన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, తానెప్పుడూ పార్టీని విమర్శించలేదని అన్నారు. హైదరాబాద్ రాగానే తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు ముఖ్యమని.. తాను దేనికీ భయపడనని హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్ఠానం మల్కాజిగిరి అభ్యర్థి మార్పు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి మైననంపల్లి హనుమంతరావును తప్పించి ఆ స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలి. దీనికి మర్రి రాజశేఖర్ రెడ్డితోపాటు మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. విజయావకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థినే పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు మైనంపల్లి హనుమంతరావుతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Milk Shake : మిల్క్ షేక్ తాగుతున్నారా..? ఇది ఒక్కసారి చదివితే జన్మలో తాగరు..
తాజావార్తలు
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
-
Cole Thomas Allen: సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
-
Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
-
Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
-
Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!