Malkajigiri BRS: హరీష్ రావుపై తీవ్ర విమర్శలు.. మైనంపల్లి స్థానంలో మరో అభ్యర్థి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malkajigiri BRS: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో తీవ్ర కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తొలి దశ జాబితా ప్రకటించినప్పటి నుంచి హరీష్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో హన్మంతరావుపై బీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇప్పటికే ఆయనకు పార్టీ టికెట్ కేటాయించగా.. అభ్యర్థి మార్పు ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనట్లు సమాచారం. మల్కాజిగిరి సీటుతో పాటు మెదక్ సీటు కూడా తన కుమారుడికి ఇవ్వాలని హన్మంతరావు గత కొంతకాలంగా కోరుతున్నారు. ఇదే అంశంపై ఆయన ఈ నెల 21న కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తును చాలా మంది నాశనం చేశారని, తన కుమారుడికి టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రబ్బర్ చెప్పులతో వచ్చిన వ్యక్తి లక్షల కోట్లు సంపాదించాడని తిరుమలలో హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ టిక్కెట్లు ప్రకటించే ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ జాబితాలో మైనంపల్లి పేరు ఉంది.
Read also: Telangana Cabinet: రేపు కేబినెట్ విస్తరణ.. పట్నం మహేందర్రెడ్డికి చోటు..!
Also Read
అయితే మైనంపల్లి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ను మీడియా ప్రశ్నించగా.. తామే టికెట్ ఇచ్చామని చెప్పారు. మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తదితరులు స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ.. తాము హరీష్ వెంట ఉంటామన్నారు. తదనంతర పరిణామాల్లో మైనంపల్లి కాంగ్రెస్ వైపు వెళ్తున్నారనే టాక్ వచ్చింది. అయితే మంగళవారం తిరమలలో మరోసారి మీడియాతో మాట్లాడిన మైనంపల్లి.. తన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, తానెప్పుడూ పార్టీని విమర్శించలేదని అన్నారు. హైదరాబాద్ రాగానే తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు ముఖ్యమని.. తాను దేనికీ భయపడనని హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్ఠానం మల్కాజిగిరి అభ్యర్థి మార్పు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి మైననంపల్లి హనుమంతరావును తప్పించి ఆ స్థానంలో ఎవరిని బరిలోకి దింపాలి. దీనికి మర్రి రాజశేఖర్ రెడ్డితోపాటు మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. విజయావకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థినే పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు మైనంపల్లి హనుమంతరావుతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Milk Shake : మిల్క్ షేక్ తాగుతున్నారా..? ఇది ఒక్కసారి చదివితే జన్మలో తాగరు..
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!