భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేడు 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. 2001 ఏప్రిల్ 27న స్థాపించిన ఈ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుని, 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. భవన్లో ఉదయం 11 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జెండా ఎగరవేయనున్నారు. గ్రామాలు, పట్టణాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో అన్ని స్థాయిల్లో పార్టీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ నాయకత్వం కార్యకర్తలకు పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు సహా ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు. సమావేశంలో కేసీఆర్ పార్టీ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల అధికార ప్రస్థానం, రెండున్నర ఏళ్ల ప్రతిపక్ష హోదాలోని కార్యకలాపాలను నాయకులకు వివరించనున్నారు. రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై నాయకులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
