Peddapalli: కూలిన మానేరు నదిపై నిర్మాణంలో వున్న వంతెన.. తప్పిన ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddapalli: మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడులో నిన్న (సోమవారం) అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఓడూరు-భూపాలపల్లి జిల్లా గుర్మిళ్లపల్లి మధ్య దూరాన్ని తగ్గించేందుకు మానేరు నదిపై 2016లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. కానీ కాంట్రాక్టర్ల మార్పు, నిధుల కొరతతో వంతెన నిర్మాణం ఆగిపోయింది. అయితే సోమవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు వంతెన గర్డర్లు కూలిపోయాయి. ఇదిలా ఉండగా అర్ధరాత్రి వంతెన కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పగటిపూట రాకపోకలు సాగించే సమయంలో కూలిపోయి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేదన్నారు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పగటిపూట రాకపోకలు సాగించే సమయంలో వంతెన కూలిపోయి ఉంటే ప్రాణనష్టం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. వంతెన నిర్మాణం నాణ్యతపైనా విమర్శలు వస్తున్నాయి.
Read also: Khammam Crime: టీ కోసం పెళ్లి ఇంట ఘర్షణ.. బీరు సీసాలు, కర్రలతో దాడి.. చివర్లో ఊహించని ట్విస్ట్..!
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
పెద్దపల్లి జిల్లా ఓడేడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరాన్ని తగ్గించేందుకు వాగుపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. 2016 ఆగస్టు నెలలో రూ.49 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్టర్ల మార్పు, నిధుల కొరత తదితర కారణాలతో నిర్మాణంలో జాప్యం జరుగుతుండడంతో స్థానికులు అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. పిల్లర్లు, కాలువల మధ్య బ్యాలెన్సింగ్ కోసం వేసిన చెక్క ముక్కలు దెబ్బతిన్నాయి. ఈ వంతెన నిర్మాణంలో భాగంగా గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి బీమ్లు సైతం కొట్టుకుపోయాయి. పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. ఇటీవల బ్రిడ్జిపై ఉన్న సిమెంటు కాలువలు కూలిపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం నిర్మాణ పనుల వల్ల కూలిపోయిందా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. కాంట్రాక్టుల్లో కమీషన్లు దండుకుంటున్న శ్రద్ద నిర్మాణ పనులపై చూపడం లేదని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
China floods: చైనాలో భారీ వర్షం.. నలుగురు మృతి, 10 మంది గల్లంతు..
తాజావార్తలు
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!