Brave Incident: వాగులో చిక్కుకున్న కూలీలు… కాపాడిన యువకులు.
- నక్కల వాగులో చిక్కుకున్న 15 మంది కూలీలు
- యువకుల ధైర్యంతో సురక్షితంగా బయటపడ్డవారు
- వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం గ్రామస్తుల డిమాండ్
- గతంలో జరిగిన ప్రాణాంతక ఘటనలపై గ్రామస్తుల ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brave Incident: కాల్వ శ్రీరాంపూర్ మండలం జొన్నల మల్యాల సమీపంలోని నక్కల వాగులో కూలీలు చిక్కుకున్నారు. మల్యాల నుండి పోచంపల్లి వెళ్లే దారిలో నక్కల వాగు అవతలి ఒడ్డు వైపు ఉన్న రైతుల పొలాల్లో ఉదయం వరి నాట్ల కోసం పెద్దపల్లి మండలం గౌరెడ్డి పేట గ్రామం నుండి 15 మంది కూలీలు రావడం జరిగింది. ఉదయం వర్షం అంతంతమాత్రంగా ఉండడంతో అవతలి వైపుకు దాటిన కూలీలందరూ పని ముగించుకుని తిరిగి వచ్చే క్రమంలో మధ్యాహ్నం కురిసిన కొండపోత వర్షానికి నక్కల వాగు ఉధృతం అయి అందులో చిక్కుబడిపోయారు. వెంటనే విషయం తెలుసుకున్న మల్యాల గ్రామానికి చెందిన కొందరు యువకులు తాళ్ల సహాయంతో కూలీల అందరిని క్షేమంగా బయటికి తీసుకొచ్చారు.
Anger Effects: కోపం వల్ల ఎన్ని జబ్బులు వస్తాయో తెలుసా..? లిస్ట్ ఇదే..
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
వాగు దాటే క్రమంలో ఇద్దరు మహిళలు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు. కూలీ కోసం వస్తే ప్రాణాల మీదికి వచ్చిందంటూ ఒడ్డుకు చేరుకున్న మహిళలు ఊపిరి పీల్చుకుని ఆవేదనతో చెప్పారు. మల్యాల గ్రామానికి చెందిన వేల్పుల సంపత్, రాపర్తి వేణు, రాపర్తి మల్లయ్య, శీలం సుధాకర్ రెడ్డి, శీలం ప్రభాకర్ రెడ్డి లెక్కల వేణుగోపాల్ రెడ్డి, వేల్పుల కల్పన, మూడెత్తుల సదయ్య, ఆకుల ప్రమీల, ఇందుర్తి సదయ్య, బొడ్డు రాజయ్య, గడ్డం రమేష్, పడాల కుమారస్వామి, మూడెత్తుల శంకరయ్య, ఇందుర్తి నాగరాజు లు ధైర్యంగా వాగులోకి దిగి తాల సహాయంతో వారందరినీ కాపాడారు.
ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే నక్కల వాగుపై బ్రిడ్జిని నిర్మించి తమ కష్టాలను తీర్చాలని మల్యాల గ్రామస్తులు కోరుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఎవరూ పట్టించుకోవడంలేదని.. నిత్యం వాగు దాటి వ్యవసాయ పనులు చూసుకోవడానికి అవతలి వైపుకు వెళ్లక తప్పని పరిస్థితులు ఉన్నాయని, ఏ క్షణంలో ఏమవుతుందో తెలియక ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
గతంలో ఈ వాగులో మల్యాల గ్రామానికి చెందిన మామిడి కొమురయ్య ఎడ్ల బండితో సహా కొట్టుకుపోవడం జరిగిందని ఈ ప్రమాదంలో ఎడ్లు చనిపోవడం కూడా జరిగింది. అలాగే మీర్జంపేట గ్రామానికి సెక్రటరీగా పనిచేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా తన వాహనంతో సహా ఇదే వాగులో కొట్టుకొని పోయి చనిపోయాడు. ఇలా ఇంకెన్ని మరణాలు సంభవిస్తే మా బతుకులు బాగుపడుతాయి అంటూ గ్రామస్తులు ఆవేదనతో చెబుతున్నారు.
Can You Eat Snake Eggs: పాము గుడ్లతో ఆమ్లెట్ వేసుకుని తింటే ఏమౌతుంది..?
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!