Boora Narsaiah Goud: బీజేపీ అధికారంలో ఉండుంటే.. తెలంగాణ మరో లెవెల్లో ఉండేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boora Narsaiah Goud Again Fires on CM KCR: మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు అడ్డుపడుతూ.. కేసీఆర్ హైందవుడి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చిన గిరి వికాష్ నిధులను 30 శాతం కూడా ఖర్చు పెట్టలేదని పేర్కొన్నారు. కృష్ణ, గోదారి నదులు మహారాష్ట్ర నుంచి మొదలవుతాయని.. ఆ నదుల విషయంలో మహారాష్ట్ర అడ్డుపడితే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు బ్రతుకుతాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఒక ప్రత్యేక దేశం అయినట్టు, అది కేసీఆర్ రాష్ట్రం అన్నట్టు బీఆర్ఎస్ నేతలు భ్రమలో ఉన్నారని.. ఆ భ్రమలో నుంచి వాళ్లు బయటకు రావాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం మన భాతరదేశంలో భాగమేనని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండుంటే.. తెలంగాణ అనేక రకాలుగా అబివృద్ధి చెందేదని వెల్లడించారు.
Bajrang Dal: భజరంగ్ దళ్ను నిషేధిస్తామని కాంగ్రెస్ హామీ.. ప్రధాని మోడీ విమర్శలు..
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
తెలంగాణ ధనిక రాష్ట్రమని బీఆర్ఎస్ నేతలు అబద్ధం చెప్తున్నారని ఆరోపించిన బూరనర్సయ్య గౌడ్.. నిజంగానే తెలంగాణ ధనిక రాష్ట్రమైతే మరి ఎందుకు జీఎస్టీ కలెక్షన్ లేదని నిలదీశారు. మహారాష్ట్రలో 33 వేల 196 కోట్లు, కర్ణాటకలో 4 వేల 593 కోట్లు, గుజరాత్లో 11 వేల 7 వందల 21 కోట్లు, హర్యానాలో 10 వేల 35 కోట్లు, జార్ఖండ్లో 3700 కోట్ల మేర జీఎస్టీ కలెక్షన్ వస్తోందని వివరించారు. కానీ.. తెలంగాణలో మాత్రం 5600 కోట్లు మాత్రమే జీఎస్టీ మీద ఆదాయం వస్తోందన్నారు. ఎనిమిదేళ్లలో 5 లక్షల కోట్లు అప్పు తెలంగాణలో ఉందని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే.. తెలంగాణలో మాత్రమే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. లిక్కర్ దందా కూడా ఎక్కువగా ఉందన్న ఆయన.. రాష్ట్రంలో అత్యధికంగా మద్యం ద్వారా డబ్బు లిక్విడ్ రూపంలో వస్తోందని అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టి సచివాలయానికి ప్రతిపక్షాలను రాకుండా అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ పేరు తొలగించి.. ‘కేసీఆర్ సచివాలయం’ అనే పేరు పెట్టుకోవాలంటూ బూర నర్సయ్య గౌడ్ ధ్వజమెత్తారు.
Morgan Stanley Layoff: మోర్గాన్ స్టాన్లీలో మరో రౌండ్ లేఆఫ్స్.. ఉద్యోగుల ఉద్వాసనకు ప్లాన్
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?