Boora Narsaiah Goud: బీజేపీ అధికారంలో ఉండుంటే.. తెలంగాణ మరో లెవెల్లో ఉండేది
Boora Narsaiah Goud Again Fires on CM KCR: మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు అడ్డుపడుతూ.. కేసీఆర్ హైందవుడి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చిన గిరి వికాష్ నిధులను 30 శాతం కూడా ఖర్చు పెట్టలేదని పేర్కొన్నారు. కృష్ణ, గోదారి నదులు మహారాష్ట్ర నుంచి మొదలవుతాయని.. ఆ నదుల విషయంలో మహారాష్ట్ర అడ్డుపడితే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు బ్రతుకుతాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఒక ప్రత్యేక దేశం అయినట్టు, అది కేసీఆర్ రాష్ట్రం అన్నట్టు బీఆర్ఎస్ నేతలు భ్రమలో ఉన్నారని.. ఆ భ్రమలో నుంచి వాళ్లు బయటకు రావాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం మన భాతరదేశంలో భాగమేనని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండుంటే.. తెలంగాణ అనేక రకాలుగా అబివృద్ధి చెందేదని వెల్లడించారు.
Bajrang Dal: భజరంగ్ దళ్ను నిషేధిస్తామని కాంగ్రెస్ హామీ.. ప్రధాని మోడీ విమర్శలు..
Also Read
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
- Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
తెలంగాణ ధనిక రాష్ట్రమని బీఆర్ఎస్ నేతలు అబద్ధం చెప్తున్నారని ఆరోపించిన బూరనర్సయ్య గౌడ్.. నిజంగానే తెలంగాణ ధనిక రాష్ట్రమైతే మరి ఎందుకు జీఎస్టీ కలెక్షన్ లేదని నిలదీశారు. మహారాష్ట్రలో 33 వేల 196 కోట్లు, కర్ణాటకలో 4 వేల 593 కోట్లు, గుజరాత్లో 11 వేల 7 వందల 21 కోట్లు, హర్యానాలో 10 వేల 35 కోట్లు, జార్ఖండ్లో 3700 కోట్ల మేర జీఎస్టీ కలెక్షన్ వస్తోందని వివరించారు. కానీ.. తెలంగాణలో మాత్రం 5600 కోట్లు మాత్రమే జీఎస్టీ మీద ఆదాయం వస్తోందన్నారు. ఎనిమిదేళ్లలో 5 లక్షల కోట్లు అప్పు తెలంగాణలో ఉందని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే.. తెలంగాణలో మాత్రమే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. లిక్కర్ దందా కూడా ఎక్కువగా ఉందన్న ఆయన.. రాష్ట్రంలో అత్యధికంగా మద్యం ద్వారా డబ్బు లిక్విడ్ రూపంలో వస్తోందని అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టి సచివాలయానికి ప్రతిపక్షాలను రాకుండా అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ పేరు తొలగించి.. ‘కేసీఆర్ సచివాలయం’ అనే పేరు పెట్టుకోవాలంటూ బూర నర్సయ్య గౌడ్ ధ్వజమెత్తారు.
Morgan Stanley Layoff: మోర్గాన్ స్టాన్లీలో మరో రౌండ్ లేఆఫ్స్.. ఉద్యోగుల ఉద్వాసనకు ప్లాన్
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!