Boora Narsaiah Goud: బీజేపీ అధికారంలో ఉండుంటే.. తెలంగాణ మరో లెవెల్లో ఉండేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boora Narsaiah Goud Again Fires on CM KCR: మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు అడ్డుపడుతూ.. కేసీఆర్ హైందవుడి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చిన గిరి వికాష్ నిధులను 30 శాతం కూడా ఖర్చు పెట్టలేదని పేర్కొన్నారు. కృష్ణ, గోదారి నదులు మహారాష్ట్ర నుంచి మొదలవుతాయని.. ఆ నదుల విషయంలో మహారాష్ట్ర అడ్డుపడితే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు బ్రతుకుతాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఒక ప్రత్యేక దేశం అయినట్టు, అది కేసీఆర్ రాష్ట్రం అన్నట్టు బీఆర్ఎస్ నేతలు భ్రమలో ఉన్నారని.. ఆ భ్రమలో నుంచి వాళ్లు బయటకు రావాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం మన భాతరదేశంలో భాగమేనని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండుంటే.. తెలంగాణ అనేక రకాలుగా అబివృద్ధి చెందేదని వెల్లడించారు.
Bajrang Dal: భజరంగ్ దళ్ను నిషేధిస్తామని కాంగ్రెస్ హామీ.. ప్రధాని మోడీ విమర్శలు..
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
తెలంగాణ ధనిక రాష్ట్రమని బీఆర్ఎస్ నేతలు అబద్ధం చెప్తున్నారని ఆరోపించిన బూరనర్సయ్య గౌడ్.. నిజంగానే తెలంగాణ ధనిక రాష్ట్రమైతే మరి ఎందుకు జీఎస్టీ కలెక్షన్ లేదని నిలదీశారు. మహారాష్ట్రలో 33 వేల 196 కోట్లు, కర్ణాటకలో 4 వేల 593 కోట్లు, గుజరాత్లో 11 వేల 7 వందల 21 కోట్లు, హర్యానాలో 10 వేల 35 కోట్లు, జార్ఖండ్లో 3700 కోట్ల మేర జీఎస్టీ కలెక్షన్ వస్తోందని వివరించారు. కానీ.. తెలంగాణలో మాత్రం 5600 కోట్లు మాత్రమే జీఎస్టీ మీద ఆదాయం వస్తోందన్నారు. ఎనిమిదేళ్లలో 5 లక్షల కోట్లు అప్పు తెలంగాణలో ఉందని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే.. తెలంగాణలో మాత్రమే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. లిక్కర్ దందా కూడా ఎక్కువగా ఉందన్న ఆయన.. రాష్ట్రంలో అత్యధికంగా మద్యం ద్వారా డబ్బు లిక్విడ్ రూపంలో వస్తోందని అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టి సచివాలయానికి ప్రతిపక్షాలను రాకుండా అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ పేరు తొలగించి.. ‘కేసీఆర్ సచివాలయం’ అనే పేరు పెట్టుకోవాలంటూ బూర నర్సయ్య గౌడ్ ధ్వజమెత్తారు.
Morgan Stanley Layoff: మోర్గాన్ స్టాన్లీలో మరో రౌండ్ లేఆఫ్స్.. ఉద్యోగుల ఉద్వాసనకు ప్లాన్
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!