Boora Narsaiah Goud: బీజేపీ అధికారంలో ఉండుంటే.. తెలంగాణ మరో లెవెల్లో ఉండేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boora Narsaiah Goud Again Fires on CM KCR: మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు అడ్డుపడుతూ.. కేసీఆర్ హైందవుడి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చిన గిరి వికాష్ నిధులను 30 శాతం కూడా ఖర్చు పెట్టలేదని పేర్కొన్నారు. కృష్ణ, గోదారి నదులు మహారాష్ట్ర నుంచి మొదలవుతాయని.. ఆ నదుల విషయంలో మహారాష్ట్ర అడ్డుపడితే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు బ్రతుకుతాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఒక ప్రత్యేక దేశం అయినట్టు, అది కేసీఆర్ రాష్ట్రం అన్నట్టు బీఆర్ఎస్ నేతలు భ్రమలో ఉన్నారని.. ఆ భ్రమలో నుంచి వాళ్లు బయటకు రావాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం మన భాతరదేశంలో భాగమేనని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండుంటే.. తెలంగాణ అనేక రకాలుగా అబివృద్ధి చెందేదని వెల్లడించారు.
Bajrang Dal: భజరంగ్ దళ్ను నిషేధిస్తామని కాంగ్రెస్ హామీ.. ప్రధాని మోడీ విమర్శలు..
Also Read
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
తెలంగాణ ధనిక రాష్ట్రమని బీఆర్ఎస్ నేతలు అబద్ధం చెప్తున్నారని ఆరోపించిన బూరనర్సయ్య గౌడ్.. నిజంగానే తెలంగాణ ధనిక రాష్ట్రమైతే మరి ఎందుకు జీఎస్టీ కలెక్షన్ లేదని నిలదీశారు. మహారాష్ట్రలో 33 వేల 196 కోట్లు, కర్ణాటకలో 4 వేల 593 కోట్లు, గుజరాత్లో 11 వేల 7 వందల 21 కోట్లు, హర్యానాలో 10 వేల 35 కోట్లు, జార్ఖండ్లో 3700 కోట్ల మేర జీఎస్టీ కలెక్షన్ వస్తోందని వివరించారు. కానీ.. తెలంగాణలో మాత్రం 5600 కోట్లు మాత్రమే జీఎస్టీ మీద ఆదాయం వస్తోందన్నారు. ఎనిమిదేళ్లలో 5 లక్షల కోట్లు అప్పు తెలంగాణలో ఉందని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే.. తెలంగాణలో మాత్రమే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. లిక్కర్ దందా కూడా ఎక్కువగా ఉందన్న ఆయన.. రాష్ట్రంలో అత్యధికంగా మద్యం ద్వారా డబ్బు లిక్విడ్ రూపంలో వస్తోందని అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టి సచివాలయానికి ప్రతిపక్షాలను రాకుండా అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ పేరు తొలగించి.. ‘కేసీఆర్ సచివాలయం’ అనే పేరు పెట్టుకోవాలంటూ బూర నర్సయ్య గౌడ్ ధ్వజమెత్తారు.
Morgan Stanley Layoff: మోర్గాన్ స్టాన్లీలో మరో రౌండ్ లేఆఫ్స్.. ఉద్యోగుల ఉద్వాసనకు ప్లాన్
తాజావార్తలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!