BJP Steeting Committee: మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ స్టీరింగ్ కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Steeting Committee Meeting On Munugodu By Elections: ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఉద్దేశంతో.. బీజేపీ చాలా కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో జెండా పాతేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఓవైపు యాత్రలు, మరోవైపు మీటింగ్లతో.. జోరు చూపిస్తోంది. ఇప్పుడు 16 మంది స్టీరింగ్ మీటింగ్ని బీజేపీ నిర్వహించింది. ఇందులో భాగంగా ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో భాగంగా స్టీరింగ్ కమిటీ సభ్యులు తమతమ అభిప్రాయాలు వెల్లడించాక.. 6 మండలాలు, రెండు మునిసిపాలిటీలకు ఇంఛార్జిలను నియమించారు. ఒక్కో మండలానికి ఒక ఇంచార్జిని, ఇద్దరు సహ ఇంచార్జిలను నియమించడం జరిగింది.
ఈనెల 27తేదీన చౌటుప్పల్లో మండల ఇన్చార్జులు, సహ ఇంచార్జిలు సమావేశం కానున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి మొదలు దసరా వరకు మండలాల్లో ఇంచార్జిలు పర్యటించనున్నారు. వారి మకాం కూడా అక్కడే! ఇదే సమయంలో బూత్ కమిటీలపై సమీక్ష నిర్వహించి, బలోపేతం చేయాలని నిర్ణయించారు. సామాజిక వర్గాల వారీగా మీటింగ్లు పెట్టాలని డిసైడ్ అయ్యారు. మునుగోడు ఎన్నికల ఇంచార్జిగా వివేక్ వెంకట స్వామిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడులో గెలిస్తే రాష్ట్రంలో గెలిచినట్టేనన్న అభిప్రాయం ఉందని అన్నారు. మునుగోడు ఫైనల్ మ్యాచ్ కానుందని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలకు మండల ఇంచార్జిలను వేయడం జరిగిందని చెప్పిన ఆక్ష్న.. భారీ మెజారిటీతో గెలవాలసి బండి సంజయ్ పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వంపై చార్జ్షీట్, మేడిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిపారు.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
ఆయా మండలాలకు నియామకమైన ఇంచార్జిలు:
చౌటుప్పల్ – కూన శ్రీశైలం గౌడ్
చౌటుప్పల్ మునిసిపల్ – రేవూరి ప్రకాశ్ రెడ్డి
నారాయణ్పూర్ – రఘునందన్ రావు
మునుగోడు – చాడ సురేష్ రెడ్డి
చండూరు – నందీశ్వర గౌడ్
చండూరు మునిసిపల్ – ధర్మారావు
నాంపల్లి – ఏనుగు రవీందర్ రెడ్డి
మర్రి గూడెం – కొండ విశ్వేశ్వర్ రెడ్డి
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!