MP Laxman: టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Laxman Says Both TRS and Congress Parties Playing Games: కాంగ్రెస్, టీఆర్ఎస్ వేర్వేరు కావని.. ఆ రెండు పార్టీలు కలిసి నాటకమాడుతున్నాయని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ ఆరోపించారు. కుటుంబ పార్టీలు ఒకే వేదిక మీదకు రావాలని చూస్తున్నాయని.. కాంగ్రెసేతర, బీజేపీయేతర నేతలు ఒక్కటి అవుతున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్ తాయిలాలు ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అంటున్నారని.. కానీ ఎనిమిదేళ్ల నుంచి వారిని తెలంగాణ ప్రభుత్వం దగా, మోసం చేసిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జీవో జారీ చేసి, గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా.. కేంద్రంపై ఆరోపణలు చేయొద్దని కోరారు. రాహుల్ గాంధీ భాష్యాన్నే సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
సచివాలయానికి రాని సీఎం కేసీఆర్.. ఇప్పుడు సచివాలయానికి డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి అవమానించాలని అనుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. రజాకారులకు వ్యతిరేకంగా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడకుండా ఉత్సవాలని నిర్వహించారని అన్నారు. లెఫ్ట్ పార్టీలు, ఏ ఇతర పార్టీలు ఏకమైనా.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు బీజేపీ వెంటే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో.. రాష్ట్ర రిజర్వేషన్లకు కేంద్ర ప్రమేయంతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర రిజర్వేషన్లు వేర్వేరుగా ఉంటాయని.. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు చేసుకునే స్వేచ్ఛ ఆయా రాష్ట్రాలకు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈనెల 17వ తేదీన ప్రధాని మోడీ పుట్టినరోజు జరుపుకోగా.. దాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2 వరకు ‘సేవా పక్షం’ పేరుతో కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!