MP Laxman: టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Laxman Says Both TRS and Congress Parties Playing Games: కాంగ్రెస్, టీఆర్ఎస్ వేర్వేరు కావని.. ఆ రెండు పార్టీలు కలిసి నాటకమాడుతున్నాయని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ ఆరోపించారు. కుటుంబ పార్టీలు ఒకే వేదిక మీదకు రావాలని చూస్తున్నాయని.. కాంగ్రెసేతర, బీజేపీయేతర నేతలు ఒక్కటి అవుతున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్ తాయిలాలు ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అంటున్నారని.. కానీ ఎనిమిదేళ్ల నుంచి వారిని తెలంగాణ ప్రభుత్వం దగా, మోసం చేసిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జీవో జారీ చేసి, గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా.. కేంద్రంపై ఆరోపణలు చేయొద్దని కోరారు. రాహుల్ గాంధీ భాష్యాన్నే సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
సచివాలయానికి రాని సీఎం కేసీఆర్.. ఇప్పుడు సచివాలయానికి డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి అవమానించాలని అనుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. రజాకారులకు వ్యతిరేకంగా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడకుండా ఉత్సవాలని నిర్వహించారని అన్నారు. లెఫ్ట్ పార్టీలు, ఏ ఇతర పార్టీలు ఏకమైనా.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు బీజేపీ వెంటే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో.. రాష్ట్ర రిజర్వేషన్లకు కేంద్ర ప్రమేయంతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర రిజర్వేషన్లు వేర్వేరుగా ఉంటాయని.. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు చేసుకునే స్వేచ్ఛ ఆయా రాష్ట్రాలకు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈనెల 17వ తేదీన ప్రధాని మోడీ పుట్టినరోజు జరుపుకోగా.. దాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 2 వరకు ‘సేవా పక్షం’ పేరుతో కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
-
Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
RSS: భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.. ఆయోధ్య నిందితులను శిక్షించాలన్న ఆర్ఎస్ఎస్
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?