BJP: స్పీకర్పై గవర్నర్కు బీజేపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్రావులను… స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డు తగిలారంటూ… మంత్రి తలసాని తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని ఆమోదించిన సభాపతి… ముగ్గురిపై ఈ సమావేశాల ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. ముగ్గురు ఎమ్మెల్యే సస్పెన్షన్పై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైరయ్యారు. రెండు నిమిషాల్లోనే అంతా జరిగిపోయిందన్నారు. ఇక, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా… రాజ్యాంగాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ సభ్యులు మండిపడ్డారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కేసీఆర్కు… సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిసి… ఫిర్యాదు చేశారు.
Read Also: Women’s Day 2022: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు.. మానవ జాతికి మహిళ ఒక వరం
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
రాష్ట్ర శాసనసభలో జరిగిన ఘటనపై గవర్నర్ కి వివరించామని.. గవర్నర్ ను పిలవక పోవడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పామని.. మేం మూడో వరుసలో నిలబడి ఉన్నాం.. కాంగ్రెస్ నేతలు మొదటి వరుసలో ఐదుగురు నిలబడ్డారు.. స్పీకర్ కు నివేదించేందుకు కొంత ముందుకు వెళ్లారు రాజాసింగ్, గతంలో స్పీకర్ లు ఇలా వ్యవహరించి ఉంటే మీరు ఇలా ఉండేవారా అని ప్రశ్నించారు రఘునందన్ రావు.. ఈ రోజు జరిగిన ఘటన నాలుగున్నర కోట్లమందికి జరిగిన అవమానం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడమని రిప్రజెంటేషన్ ఇవ్వమని అడిగాం, కచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పారన్నారు.. ఇక, గత దశాబ్ద కాలంగా వస్తున్న సాంప్రదాయాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు ఈటల రాజేందర్.. కెసీఆర్ వ్యవహారం జుగుప్సాకరంగా ఉందన్న ఆయన.. అందరూ నేను చెప్పినట్టు వినాలనుకుంటున్నారు. ప్రజలు సిగ్గు తలదించుకునేలా చేసారు.. భవిష్యత్తు లో ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని కోరితే మా మొహాలు చూడకూడదు అని సస్పెండ్ చేశారని మండిపడ్డ ఆయన.. మాపై జరిగిన దాడిని ప్రజలకు వివరిస్తాం.. అతిపెద్ద రాజ్యాంగం మనది… ప్రజాస్వామ్యం కాపాడే ప్రయత్నం చేస్తాఅని గవర్నర్ హామీ ఇచ్చారు తెలిపారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..