కేసీఆర్ నిజాం మాదిరిగా తయారు అయ్యాడు : రాజాసింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనమిదవ నిజాం మాదిరిగా తయారు అయ్యాడు. రాష్ట్రంలో జాతీయ జెండా ఎగరవేస్తే కేసులు బుక్ చేస్తారు, జైలుకు పంపుతారు, రౌడి షీట్లు వేస్తారని దేశానికి తెలియాలి అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో నిజాం పాలన సాగుతోందని అందరికీ తెలియాలి. ఎన్ని కేసులైనా బుక్ చేసుకోండి జెండా ఎగర వేసేందుకు, ర్యాలీ తీసేందుకు ఎలాంటి అనుమతి తీసుకోం. ఏ దేశంలోనూ ,ఏ రాష్ట్రంలోనూ జాతీయ పథాకాన్ని ఎగరవేసేందుకు అనుమతి కోరరు. గోషామహల్ నియోజక వర్గంలో షాహినాత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిదిలోని బేగం బజార్ లో జాతీయ పతాకంతో ర్యాలీ తీస్తారు అన్నారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తారు. రెండేళ్ళ క్రింతం ర్యాలీ తీసిన యువజన సంఘం అద్యక్షుడితో పాటు నాపై కూడా ఎఫ్ఐఆర్ చేసారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గించారన్న నేపంతో కేసు బుక్ చేసారు. ఈ ఏడాది కూడా ఆగస్ట్ 15 న జాతీయ పతాకం ఎగర వేయడంతో పాటు ర్యాలీకి అనుమతి కోరేందుకు యువకులు వెళ్ళారు. పర్మిషన్ మేం ఇవ్వలేమని.. కమిషనర్ ఇస్తారని వారికి లెటర్ కూడా ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో జాతీయ పతాకం ఎగుర వేయాలి అంటే కూడా అనుమతి కావాలి. జాతీయ పథాకాన్ని ఎగర వేయాలంటే కూడా అనుమతి కోరాలనడం ప్రభుత్వంకు, అధికారులకు సిగ్గుచేటూ. అనుమతి కావాలని కోరిన అదికారులు విషం తాగి చనిపోవాలి. ఎందుకంటే మీరు కాని , మీ పూర్వికులు దేశం గురించి ఏమీ చేయలేదు. ఎంతో మంది త్యాగం చేస్తే దేశానికి స్వాతంత్రం వచ్చింది. వారి కుటుంబాలను అడిగితే తెలుస్తుంది ఎంత కష్టపడ్డారో. తెలంగాణ పోలీసు అదికారులు స్వతంత్రం కోసం చనిపోయిన వారి కుటుంబాన్ని అడిగితే తెలుస్తుంది అని తెలిపారు.
Also Read
అలాగే పోలీసులు ఇంక ఘనంగా స్వతంత్ర వేడుకలు జరుపుకోమని చెప్పాలి. దేశం పట్ల మీ భావన ఇదేనా..సిగ్గురావాలి. డీజీపీ , కమిషనర్ మీ లోకల్ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడాలి. ఏ అదికారి ర్యాలీకి అనుమతి ఇవ్వరో, ర్యాలీ తీస్తే జైలుకు పంపిస్తా అనే వారికి సస్పెండ్ చేయాలి. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ఆగస్టు 15న జెండా ఎగర వేసేందుకు ర్యాలీ తీసేందుకు ఎలాంటి అనుమతి తీసుకోం. రెండేళ్ళుగా కోర్టు చుట్టు తిరుగుతున్నాం.. ఎన్ని కేసులు అయినా ఎదుర్కొంటాం. ఎన్ని కేసులైనా బుక్ చేయండి.. మేం అన్నింటికి తయారై ఉన్నాం అని పేర్కొన్నారు.
- Tags
- bjp mla
- cm kcr
- raja singh
- telangana
- TRS
తాజావార్తలు
-
TMC Crisis: మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలోకి మాజీ టీఎంసీ ఎంపీలు..
-
CJP: పార్లమెంట్ మార్చ్.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు పూర్తి.. ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
-
Bihar Politics: ఆర్జేడీలో ఇంటిపోరు.. నాపై చర్య తీసుకోవాలని లాలూ కుమార్తె సవాల్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!