కేసీఆర్ నిజాం మాదిరిగా తయారు అయ్యాడు : రాజాసింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనమిదవ నిజాం మాదిరిగా తయారు అయ్యాడు. రాష్ట్రంలో జాతీయ జెండా ఎగరవేస్తే కేసులు బుక్ చేస్తారు, జైలుకు పంపుతారు, రౌడి షీట్లు వేస్తారని దేశానికి తెలియాలి అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో నిజాం పాలన సాగుతోందని అందరికీ తెలియాలి. ఎన్ని కేసులైనా బుక్ చేసుకోండి జెండా ఎగర వేసేందుకు, ర్యాలీ తీసేందుకు ఎలాంటి అనుమతి తీసుకోం. ఏ దేశంలోనూ ,ఏ రాష్ట్రంలోనూ జాతీయ పథాకాన్ని ఎగరవేసేందుకు అనుమతి కోరరు. గోషామహల్ నియోజక వర్గంలో షాహినాత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిదిలోని బేగం బజార్ లో జాతీయ పతాకంతో ర్యాలీ తీస్తారు అన్నారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తారు. రెండేళ్ళ క్రింతం ర్యాలీ తీసిన యువజన సంఘం అద్యక్షుడితో పాటు నాపై కూడా ఎఫ్ఐఆర్ చేసారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గించారన్న నేపంతో కేసు బుక్ చేసారు. ఈ ఏడాది కూడా ఆగస్ట్ 15 న జాతీయ పతాకం ఎగర వేయడంతో పాటు ర్యాలీకి అనుమతి కోరేందుకు యువకులు వెళ్ళారు. పర్మిషన్ మేం ఇవ్వలేమని.. కమిషనర్ ఇస్తారని వారికి లెటర్ కూడా ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో జాతీయ పతాకం ఎగుర వేయాలి అంటే కూడా అనుమతి కావాలి. జాతీయ పథాకాన్ని ఎగర వేయాలంటే కూడా అనుమతి కోరాలనడం ప్రభుత్వంకు, అధికారులకు సిగ్గుచేటూ. అనుమతి కావాలని కోరిన అదికారులు విషం తాగి చనిపోవాలి. ఎందుకంటే మీరు కాని , మీ పూర్వికులు దేశం గురించి ఏమీ చేయలేదు. ఎంతో మంది త్యాగం చేస్తే దేశానికి స్వాతంత్రం వచ్చింది. వారి కుటుంబాలను అడిగితే తెలుస్తుంది ఎంత కష్టపడ్డారో. తెలంగాణ పోలీసు అదికారులు స్వతంత్రం కోసం చనిపోయిన వారి కుటుంబాన్ని అడిగితే తెలుస్తుంది అని తెలిపారు.
Also Read
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- Lakshmis Empiria : వర్షాన్నీ లెక్కచేయని 5K రన్.. మియాపూర్లో సందడి.!
- Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
అలాగే పోలీసులు ఇంక ఘనంగా స్వతంత్ర వేడుకలు జరుపుకోమని చెప్పాలి. దేశం పట్ల మీ భావన ఇదేనా..సిగ్గురావాలి. డీజీపీ , కమిషనర్ మీ లోకల్ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడాలి. ఏ అదికారి ర్యాలీకి అనుమతి ఇవ్వరో, ర్యాలీ తీస్తే జైలుకు పంపిస్తా అనే వారికి సస్పెండ్ చేయాలి. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ఆగస్టు 15న జెండా ఎగర వేసేందుకు ర్యాలీ తీసేందుకు ఎలాంటి అనుమతి తీసుకోం. రెండేళ్ళుగా కోర్టు చుట్టు తిరుగుతున్నాం.. ఎన్ని కేసులు అయినా ఎదుర్కొంటాం. ఎన్ని కేసులైనా బుక్ చేయండి.. మేం అన్నింటికి తయారై ఉన్నాం అని పేర్కొన్నారు.
- Tags
- bjp mla
- cm kcr
- raja singh
- telangana
- TRS
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!